వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం-పార్లమెంటులో రద్దే తరువాయి..
ఏడాది క్రితం పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను రైతుల నిరసనలతో రద్దు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తాజా ప్రకటన మేరకు వ్యవసాయచట్టాల రద్దు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు ప్రకటించారు.
నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో చేపట్టనున్న శాసన వ్యవహారాల్లో భారత ప్రభుత్వం 'ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021'ని ఇప్పటికే లిస్ట్ చేసింది. దీనిపై చర్చించిన కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతుల నిరసనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021కు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదముద్రవేసింది. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందేందుకు కొత్త బిల్లును ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 40 రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఈ మూడు చట్టాలను రద్దు చేయడం ఒకటి. నవంబర్ 19న, మోడీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఈ సంస్కరణలను నిరసిస్తున్న రైతులను ప్రభుత్వం ఒప్పించలేక పోతుందని మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
నిరసనను విరమించి ఇంటికి తిరిగి రావాలని కూడా ఆయన వారిని కోరారు. రద్దు చేయాల్సిన మూడు చట్టాలు: రైతు ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) చట్టం; రైతుల (సాధికారత మరియు రక్షణ) ధర హామీ మరియు వ్యవసాయ సేవల చట్టం యొక్క ఒప్పందం; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం.












Click it and Unblock the Notifications