వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ తో ప్రపంచానికే ప్రమాదం: రాజ్ నాథ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి భారత్ కు ముప్పు పొంచివుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మంగళవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత భారతదేశంలో అప్రమత్తత ప్రకటించామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారత్ లోని అన్ని నగరాలలో హై అలర్ట్ ప్రకటించామని అన్నారు.

Union Home Minister Rajanath Singh

ఎట్టి పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు భారత్ లో దాడులు చెయ్యడానికి అవకాశం ఇవ్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్యారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 129 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

350 మందికి తీవ్రగాయాలు కావడంతో ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు. ఫ్రాన్స్ సరిహద్దులు మూసి వెయ్యాలని అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హోలండ్ ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత చర్యగా ప్రపంచ దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి.

English summary
Rajanath Singh also termed the threat emanating from the ISIS as a global challenge, saying all nations must come together to fight against ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X