సరిహద్దుల్లో 'స్మార్ట్ గ్రిడ్' విప్లవానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2026 మే 22న న్యూఢిల్లీలో జరిగిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సన్మాన వేడుక, రుస్తమ్జీ స్మారక ఉపన్యాసంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, బోర్డర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, బీఎస్ఎఫ్ సిబ్బందికి లభించిన ఈ గౌరవం దేశం పట్ల వారి అచంచలమైన విశ్వసనీయత, విధి పట్ల నిబద్ధత, సంపూర్ణ అంకితభావానికి ప్రతీక అని అన్నారు.

1965 యుద్ధం తర్వాత బీఎస్‌ఎఫ్‌ ఆవిర్భావం.. రూస్తంజీ పునాది

1965 యుద్ధం అనంతరం సరిహద్దు భద్రతలో ఉన్న లోపాలపై సమగ్ర అంచనా వేయడంతో శాంతికాలంలో కూడా భారతదేశ సరిహద్దులను పటిష్టంగా కాపాడటానికి ఒక ప్రత్యేక దళం అవసరమని గుర్తించారు. పద్మవిభూషణ్ కె.ఎఫ్. రుస్తమ్‌జీ నాయకత్వంలో ఆ సమయంలోనే బీఎస్ఎఫ్ స్థాపించబడి, అప్పటి నుంచి దేశ సరిహద్దుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రుస్తమ్‌జీ వేసిన పటిష్టమైన పునాది వల్లే బీఎస్ఎఫ్ జాతీయ భద్రత రంగంలో ఒక గొప్ప సంస్థగా ఎదిగి దేశానికి గర్వకారణంగా నిలిచిందని అమిత్ షా కొనియాడారు.

Amit Shah Announces Smart Border Project and Free Infiltration Target at BSF Event Full Details

ఆధునిక సరిహద్దు సవాళ్లు.. బీఎస్‌ఎఫ్‌ దీటుగా ముందడుగు

ప్రస్తుతం సరిహద్దు భద్రత రంగంలో అనేక కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని అమిత్ షా ఈ సందర్భంగా వెల్లడించారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, పశువుల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, వ్యవస్థీకృత నేరాలు, అలాగే డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి సమస్యలను బీఎస్ఎఫ్ ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ సునిశిత ప్రణాళికతో కూడిన ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

సమన్వయ రక్షణ గ్రిడ్ అవసరం.. ప్రాదేశిక బాధ్యతగా భద్రత

లభ్యమయ్యే వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, ఎదురయ్యే అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని బీఎస్ఎఫ్ దేశాన్ని రక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ దళం పాత్ర మరింత సమన్వయంతో, సమగ్రంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు భద్రత ఇకపై కేవలం సంప్రదాయ పద్ధతులపై ఆధారపడకూడదని, బలమైన భద్రతా వ్యవస్థకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఇతర సాయుధ బలగాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), నిఘా ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమిష్టి సమన్వయం అవసరమని తెలిపారు.

సరిహద్దు భద్రతను ఇకపై వేరుగా చూడాల్సిన పనిలేదని, బదులుగా అది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోం శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. సరిహద్దుల గుండా చొరబాట్ల వల్ల కలిగే జనాభా మార్పులు, అలాగే మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. సైబర్ బెదిరింపులు, హైబ్రిడ్ యుద్ధం, డ్రోన్‌ల ఆధారిత సవాళ్లను ఎదుర్కొనడానికి భారతదేశం కొత్త వ్యూహాలను అవలంబించాలని అమిత్ షా ఆదేశించారు.

కఠిన ప్రాంతాల్లో రక్షణ.. 2.70 లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద దళం

దేశంలోని అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాలైన సియాచిన్, కాశ్మీర్ మంచు పర్వతాలు, కుప్వారా, కేరన్, ఊరి వంటి కఠినమైన ప్రాంతాలు, రాజస్థాన్ ఎడారులు, రాన్ ఆఫ్ కచ్, సిర్ క్రీక్ యొక్క చిత్తడి ప్రాంతాలు, సుందర్‌బన్స్ దట్టమైన అడవులు, త్రిపుర, మేఘాలయ, మిజోరాంల వంటి ఈశాన్య సరిహద్దులు, అలాగే బ్రహ్మపుత్ర నదితో అనుసంధానించబడిన సున్నితమైన నదీ ప్రాంతాలలో కూడా సరిహద్దు భద్రతా దళం నిలకడగా విధులు నిర్వర్తిస్తోందని ఆయన ప్రశంసించారు.

1965లో కేవలం 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ నేడు 2.70 లక్షల మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా ఎదిగిందని అమిత్ షా గుర్తు చేశారు. 2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ రక్షణ, సరిహద్దు భద్రతా విధానాలు విప్లవాత్మక మార్పులకు లోనయ్యాయని ఆయన వెల్లడించారు. ఉరీ, పుల్వామా, పహల్గామ్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోపల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించిందని చెప్పారు.

సాంకేతిక విప్లవం.. రాబోయే ఏడాదిలో 'స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్'

ఉగ్రదాడులకు చర్చలతో ప్రతిస్పందించే యుగం ముగిసిందని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా భారతదేశం తన భద్రతా వ్యవస్థను బలోపేతం చేసుకుందని ఆయన ఉద్ఘాటించారు. దీన్ని ఒక సరికొత్త రక్షణ సిద్ధాంతంగా అభివర్ణించిన ఆయన, ఇందులో బీఎస్ఎఫ్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ సరిహద్దులను 'స్మార్ట్ బోర్డర్'గా మార్చడానికి సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని అమిత్ షా తెలిపారు.

రాబోయే సంవత్సరంలో అన్ని రకాల సాంకేతికతలను అనుసంధానించే 'స్మార్ట్ బోర్డర్' భావన కింద పటిష్టమైన సరిహద్దు భద్రతా వ్యవస్థను రూపొందించే దిశగా పనులు పురోగమిస్తున్నాయని ఆయన అన్నారు. హోం మంత్రిత్వ శాఖ త్వరలో డ్రోన్లు, రాడార్‌లు, ఆధునిక కెమెరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన 'స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్'ను ప్రవేశపెట్టనుంది. ఈ కార్యక్రమం ప్రారంభమయిన తర్వాత సరిహద్దు భద్రతా దళం పని గణనీయంగా సులభతరం అవుతుందని, మరింత బలోపేతం అవుతుందని హోం మంత్రి చెప్పారు.

బీఎస్ఎఫ్ స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం 'స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించి, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో ఉన్న సరిహద్దులను పూర్తిగా పటిష్టం చేస్తుందని, తద్వారా బీఎస్ఎఫ్ కు గణనీయమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని అమిత్ షా తెలిపారు. ధైర్యం, పరాక్రమం, అంకితభావం, దేశభక్తితో పాటు, ఈ దళానికి పటిష్టమైన సాంకేతిక మద్దతు కూడా లభిస్తుందని, ఇది రెండు సరిహద్దుల భద్రతను మరింత పెంచుతుందని వివరించారు.

చొరబాటుదారుల గుర్తింపు.. జనాభా మార్పుల కుట్రలకు బ్రేక్

నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చొరబాట్లను ఆపడమే కాకుండా, ప్రతీ ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరిస్తుందని, సహజసిద్ధం కాని జనాభా మార్పును అనుమతించదని అమిత్ షా పునరుద్ఘాటించారు. చొరబాట్ల ద్వారా జనాభా స్వరూపాన్ని మార్చే కుట్రలను బీఎస్ఎఫ్ అరికట్టాలని ఆయన సూచించారు. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలోని ప్రభుత్వాలు ఇప్పుడు అక్రమ చొరబాట్లకు స్పష్టంగా వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేశారు.

సరిహద్దులను కాపాడటంతో పాటు, గ్రామ స్థాయి అధికారులు, పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టర్లు, DDOలు, పోలీసు సూపరింటెండెంట్‌లతో సన్నిహిత సమన్వయం కొనసాగించాల్సిన బాధ్యత బీఎస్ఎఫ్ పై ఉందని శ్రీ షా స్పష్టం చేశారు. కొత్తగా చొరబడిన వారి గురించిన, వారి ప్రవేశ మార్గాల గురించిన, పశువుల అక్రమ రవాణా సహా స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్న నెట్‌వర్క్‌ల గురించిన వివరణాత్మక సమాచారాన్ని సేకరించాలని ఆయన సూచించారు. అటువంటి అన్ని మార్గాలను పద్ధతి ప్రకారం గుర్తించి మూసివేయాలని ఆయన ఆదేశించారు.

గ్రామ స్థాయి నుండి నిఘా.. చొరబాటు నెట్‌వర్క్‌ల ధ్వంసం

లభ్యమయ్యే సమాచారాన్ని ఉపయోగించి చొరబాటుదారులను నిరోధించడానికి, తొలగించడానికి ఒక వ్యవస్థీకృత విధానాన్ని నిర్మించాలని అమిత్ పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగిన చొరబాట్లను నిశ్చయాత్మకంగా ఆపాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోం మంత్రి కరాఖండిగా చెప్పారు. ప్రభుత్వ నిశ్చితమైన ప్రయత్నాల వల్ల ఐదు దశాబ్దాల నాటి నక్సలిజం సమస్య ఇప్పుడు ఇండియాలో సమర్థవంతంగా తొలగించబడిందని అమిత్ షా పేర్కొన్నారు.

భద్రతా విధానం కేవలం సమస్యలను నిరోధించడం కాదు, వాటిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. చొరబాట్లను ఎదుర్కొనడంలో అదే నిశ్చితమైన విధానాన్ని అవలంబించాలని బీఎస్ఎఫ్ ను ఆయన కోరారు. 'వైబ్రెంట్ విలేజెస్-1', 'వైబ్రెంట్ విలేజెస్-2' అనే అభివృద్ధి కార్యక్రమాలు బీఎస్ఎఫ్ సహకారంతో ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయబడుతున్నాయని అమిత్ షా తెలిపారు. బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్లకు విస్తరించినట్లు, పశ్చిమ బెంగాల్‌లోని భూ కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఖరారయ్యాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి జనాభా మిషన్ ను ప్రకటించారని, దాని కమిటీని ఏర్పాటు చేసిన వెంటనే దీనిపై పనులు ప్రారంభమవుతాయని అమిత్ షా అన్నారు. రాబోయే రోజుల్లో దేశ సరిహద్దుల్లో పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీనికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ 60వ వార్షికోత్సవం 'స్మార్ట్ బోర్డర్' నిర్మాణానికి, బీఎస్ఎఫ్ సిబ్బంది సంక్షేమానికి అంకితం చేయబడిన సంవత్సరంగా నిలుస్తుందని అమిత్ షా తెలిపారు.

రాబోయే రెండు నెలల్లో శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీఎస్ఎఫ్ సిబ్బంది, అన్ని సీఏపీఎఫ్ జవాన్ల సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుందని అమిత్ షా చెప్పారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని ప్రారంభించబోతోందని, దీనిలో సరిహద్దు భద్రతా దళం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సరిహద్దుకు ఇరువైపుల నుండి నిఘా సమాచారాన్ని సేకరించడంలో దళం యొక్క అప్రమత్తతను ఆయన ప్రశంసించారు.

రాబోయే మూడు నుండి నాలుగు సంవత్సరాలు సరిహద్దు భద్రతలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువస్తాయని ఆయన అన్నారు. సాంకేతికత సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, అయితే అది బాధ్యతలను కూడా పెంచుతుందని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశాన్ని చొరబాట్లు లేని దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించడానికి బీఎస్ఎఫ్ సిబ్బంది సాంకేతికతను స్వీకరించాలని, స్థానిక సమాజాలతో బలమైన సంబంధాలను నిర్మించుకోవాలని, స్థానిక పరిపాలనతో సమన్వయాన్ని మెరుగుపరచుకోవాలని హోం మంత్రి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+