సమైక్యాంధ్ర పోరు: బాదల్తో వైయస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శుక్రవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకారం అందించాలని ఆయన బాదల్ను కోరారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తున్న వైనాన్ని ఆయన తెలిపారు. ఆర్టికల్ 3 సవరణ కోసం చేస్తున్న ఉద్యమానికి కలిసి రావాలని కూడా ఆయన కోరారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణ కోసం ముందుకు రావాలని ఆయన అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జగన్తో పాటు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్వీందర్ బాదల్ పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందంలో పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, నాయకులు మైసురా రెడ్డి, బాలశౌరి సమావేశంలో పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం వైయస్ జగన్ పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలుస్తారు. రేపు శనివారం ఆయన డిఎంకె నేత రాజాను కలుస్తారని అంటున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications