సమైక్యాంధ్ర పోరు: బాదల్తో వైయస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శుక్రవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకారం అందించాలని ఆయన బాదల్ను కోరారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తున్న వైనాన్ని ఆయన తెలిపారు. ఆర్టికల్ 3 సవరణ కోసం చేస్తున్న ఉద్యమానికి కలిసి రావాలని కూడా ఆయన కోరారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణ కోసం ముందుకు రావాలని ఆయన అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జగన్తో పాటు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్వీందర్ బాదల్ పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధుల బృందంలో పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, నాయకులు మైసురా రెడ్డి, బాలశౌరి సమావేశంలో పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం వైయస్ జగన్ పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలుస్తారు. రేపు శనివారం ఆయన డిఎంకె నేత రాజాను కలుస్తారని అంటున్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications