జైల్లో పోలీసులపై ఖైదీల దాడి: ఇద్దరికి గాయాలు
రాయ్బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి జైల్లో కొందరు ఖైదీలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రాయ్బరేలీ జైలులోని ఖైదీలకు పలు సౌకర్యాలు అందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జైలు అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ సమయంలోనే పలువురు ఖైదీలు.. జైలర్ ధీరజ్ షా, ఉప జైలర్ శైలేంద్ర, మరికొందరు పోలీసులపై దాడులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కాగా, గాయాలపాలైన జైలర్, ఉపజైలర్, పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో జైళ్ల శాఖ డిఐజి శరద్ కుల్శ్రేష్ట జైలును సందర్శించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే కొండచరియలు విరిగిపడడానికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కులులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారా వర్షాలకు ధ్వంసమైంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications