caste census: మీరు ఢిల్లీ కోసం పని చేస్తున్నారా ?, కుల గణన ఎందుకు చెయ్యడం లేదు ?, మాజీ సీఎం !
అసెంబ్లీలో కుల గణన చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కుల గణన, జనాబా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని, అది మా పరిదిలో లేదని మంత్రి సింపుల్ గా చెప్పేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరోసారి కుల గణన విషయంలో రచ్చరచ్చ అయ్యింది. యూపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు కుల గణన జరగాలని డిమాండ్ చేశారు. యూపీలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద మాజీ సీఎం విమర్శలు గుప్పించారు. ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రజల కోసం పని చెయ్యడం లేదని, ఢిల్లీ ప్రజల కోసం పని చేస్తోందని మాజీ సీఎం ఎద్దేవ చేశారు. ఉత్తరప్రదేశ్ లో అనేక జిల్లాలో వెనుకబడిన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కుల గణన నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కుల గణన, జనాబా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని, అది మా పరిదిలో లేదని యూపీ మంత్రి సింపుల్ గా చెప్పేశారు. అసలు ఏం జరిగిందంటే ?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ, ఆర్ఎల్డీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఆర్ఎల్డీ నేతలు వెల్లోకి దిగి శివపాల్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. గందరగోళం మధ్య వారిని వాళ్ల స్థానాల్లోకి రావాలని స్పీకర్ హెచ్చరించినప్పటికీ వాళ్లు మాత్రం పట్టించుకోకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కుల గణన జరగాలి
ఈ సందర్భంగా ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కుల గణన అంశంపై యోగి ప్రభుత్వాన్ని నిలదీశారు. యూపీలో కుల గణన జరగాలని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన లేకుండా అందరి అభివృద్ధి జరగదని, బీజేపీ ప్రభుత్వం ఎందుకు కుల గణన డిమాండ్ నుంచి వైదొలుగుతోందో ఈ ప్రభుత్వమే చెప్పాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. యూపీలో కుల గణన జరగాలని ఎస్పీ గతంలో కూడా డిమాండ్ చేసిందని, ఇప్పటికీ అనుకూలంగానే మేము ఉన్నామని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు.

మీరు ఢిల్లీ కోసం పని చేస్తున్నారు ?
ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీ ప్రజల కోసం పని చెయ్యడం లేదని, ఢిల్లీ ప్రజల కోసం పని చేస్తోందని మాజీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. ఉత్తరప్రదేశ్ లో అనేక జిల్లాల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందరికి న్యాయం జరగాలంటే వెంటనే యూపీలో కుల గణన జరగాలని ఎస్పీతో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

మా చేతుల్లో ఏముంది చెప్పండి
వెంటనే యూపీలో కుల గణన నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కుల గణన, జనాబా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని, అది మా పరిదిలో లేదని యూపీ మంత్రి సురేష్ ఖన్నా ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం కావాలనే కుల గణన జరగకుండా అడ్డుకుంటున్నదని యూపీలో ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. గతంలో బీజేపీ కూడా కుల గణనకు అనుకూలంగా ఉండి ఇప్పుడు మాట మార్చుతోందని ప్రతిపక్ష్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications