ఘోరం: 3 ఏళ్ల బాలిక నోట్లో సుతిలి బాంబు పెట్టి పేల్చాడు, 50 కుట్లు పడ్డాయి
మీరట్: దీపావళి వేడుకల్లో ఓ ఆకతాయి అత్యుత్సాహం ప్రదర్శించి ఓ మూడేళ్ల బాలిక నోట్లో బాంబు పెట్టి కాల్చాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన దీపావళికి ముందు రోజు జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం మిలాక్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాలిక తండ్రి శశికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాలిక నోట్లో బాంబు పెట్టి గాయానికి కారణమైన వ్యక్తిని హర్పాల్గా గుర్తించారు.

తన కూతురు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో హర్పాల్ వచ్చాడని, తన మూడేళ్ల కూతురు నోట్లో సుతిలి బాంబు పెట్టి, కాల్చాడని ఆ బాలిక తండ్రి చెప్పారు. బాంబు పేలి తన కూతురుకు తీవ్ర గాయమైందని చెప్పారు. ఆమెకు దాదాపు 50 కుట్లు పడ్డాయని తెలిపారు. ఆమె గొంతు కూడా ఇన్ఫెక్షన్కు గురయిందని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications