దారుణం: పోలీస్ స్టేషన్లోనే యువతిని కొట్టి, కాల్చి చంపేశారు
ఉత్తర ప్రదేశ్లోని మొయిన్పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మొయిన్పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమె అరుస్తున్నా వదలలేదు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
యువతి మృతి చెందడంతో స్థానికులు కొందరు నిందితులను పట్టుకొని కొట్టారు.
భూవివాదంలో ఓ యువతిని పోలీస్ స్టేషన్లో కాల్చి చంపారని, అక్కడున్న వారు నిందితుడుని పట్టుకున్నారని, పోలీసుల ఎదుట కొట్టారని చెబుతున్నారు.
Mainpuri (UP): Woman shot dead inside a police station over land dispute; accused nabbed by people, thrashed in front of police. pic.twitter.com/XSGhdPypjQ
— ANI UP (@ANINewsUP) April 18, 2017
కాగా, పోలీసుల ఎదుటనే నిందుతుడు ఆ యువతిని చంపేశాడని చెబుతున్నారు. కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్లోనే జరిగినందున పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంరక్షణార్థం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.