దారుణం: పోలీస్ స్టేషన్లోనే యువతిని కొట్టి, కాల్చి చంపేశారు
ఉత్తర ప్రదేశ్లోని మొయిన్పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మొయిన్పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమె అరుస్తున్నా వదలలేదు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
యువతి మృతి చెందడంతో స్థానికులు కొందరు నిందితులను పట్టుకొని కొట్టారు.
భూవివాదంలో ఓ యువతిని పోలీస్ స్టేషన్లో కాల్చి చంపారని, అక్కడున్న వారు నిందితుడుని పట్టుకున్నారని, పోలీసుల ఎదుట కొట్టారని చెబుతున్నారు.
Mainpuri (UP): Woman shot dead inside a police station over land dispute; accused nabbed by people, thrashed in front of police. pic.twitter.com/XSGhdPypjQ
— ANI UP (@ANINewsUP) April 18, 2017
కాగా, పోలీసుల ఎదుటనే నిందుతుడు ఆ యువతిని చంపేశాడని చెబుతున్నారు. కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్లోనే జరిగినందున పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంరక్షణార్థం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications