రైతులకు భారీ గుడ్ న్యూస్..! ఈసారి తగ్గబోతున్న యూరియా రేట్లు..!
గతేడాది యూరియా ధరలు (Urea Prices) పెరిగిపోయి, బ్లాక్ మార్కెటింగ్ తో బాధలు పడ్డ రైతులకు ఈసారి మాత్రం శుభవార్త అందింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) 1.7 మిలియన్ టన్నుల యూరియా దిగుమతి కోసం పిలిచిన తాజా టెండర్కు టన్నుకు $444.9-449.3 రేటు చొప్పున కొటేషన్లు వచ్చాయి ఇది 2.5 మిలియన్ టన్నుల దిగుమతి కోసం ఇండియన్ పొటాష్ లిమిటెడ్ గతంలో పిలిచిన టెండర్లో లభించిన టన్నుకు $935-959 ధర కంటే చాలా తక్కువ.
మే 27న యూరియా టెండర్ కోసం ప్రకటన ఇచ్చి, జూన్ 8న తెరిచిన తాజా టెండర్కు మొత్తం 6.25 మిలియన్ టన్నుల యూరియా సరఫరా కోసం బిడ్లు అందాయి. ఇందులో తూర్పు తీరానికి సరఫరా చేయడానికి 3.17 మిలియన్ టన్నులు , పశ్చిమ భారత ఓడరేవులకు 3.08 మిలియన్ టన్నులు ఉన్నాయి. అత్యల్ప బిడ్లు తూర్పు తీరానికి అదితా బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ ద్వారా టన్నుకు $444.9 చొప్పున, పశ్చిమ భారత తీరానికి డెలివరీ కోసం అమెరోపా ఆసియా ద్వారా టన్నుకు $449.3 చొప్పున వచ్చాయి.

లోడింగ్ పోర్ట్ల నుండి ఒప్పందం కుదుర్చుకున్న పరిమాణాలకు సంబంధించిన సరుకు రవాణా జూలై 20 నాటికి జరగాలని NFL టెండర్ నిర్దేశించింది. దీనివల్ల సరుకు ఆగస్టు నాటికి చేరుతుంది మరియు ఖరీఫ్ సీజన్ చివరి భాగంలో రైతులు దానిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో నత్రజని ఎరువుల రవాణాను నిషేధించిన తర్వాత, చైనా యూరియాకు ఎగుమతి కోటాలను జారీ చేయడమే తాజా దిగుమతి టెండర్లో తక్కువ ధరలకు ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన ఎరువుల ధరల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం భరించాల్సిన సబ్సిడీ భారం రూ.3,40,000 కోట్లకు చేరవచ్చని 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' తాజాగా నివేదించింది. ఇది బడ్జెట్ లో కేటాయించిన మొత్తానికి రెట్టింపు కావడం విశేషం.














Click it and Unblock the Notifications