ఉర్జిత్ పటేల్ వేతనం రూ.2.50 లక్షలకు పెంపు, ఇతర బ్యాంకర్ల కంటే తక్కువే!
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మూలవేతనాన్ని ఏకంగా వందశాతం పెంచింది.
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మూలవేతనాన్ని ఏకంగా వందశాతం పెంచింది.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు నెలకు జీతాన్ని రూ.రెండున్నర లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఉర్జిత్ పటేల్ కు నెలకు రూ.90వేల రూపాయాలు మాత్రమే చెల్లిస్తున్నారు.
పెంచినవేతానాన్ని గత ఏడాది జనవరి 1,వ తేది నుండి అమలు చేయనున్నారు.డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని రెండులక్షల 25 వేల రూపాయాలను చేశారు.

ఇప్పటివరకు డిప్యూటీ గవర్నర్లకు రూ.80 వేల వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వారి మూల వేతనాన్ని వంద శాతానికి పైగా పెంచేసింది.
అయితే ఆర్ బి ఐ నియంత్రిస్తున్న పలు బ్యాంకుల్లోని సీనియర్ అధికారుల అధికారుల కంటే వీరి వేతనాలు చాలా తక్కువే.












Click it and Unblock the Notifications