పాక్ కు బిగ్ షాక్: భారత్ కు తిరుగులేని విజయం
Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్పోస్ట్ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

ఈ దాడి ఘటనలో భారత్ తాజాగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO), స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT)గా ప్రకటించింది. దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో.. అల్-షబాబ్, బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS), హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి ఇతర భయానక ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ కూడా చేరినట్టయింది. అటు పాకిస్తాన్ కూ బిగ్ షాక్ ఇచ్చినట్టే అయింది.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడికి TRF బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారని, ఈ మేరకు టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు మార్కొ రూబియో తెలిపారు.
పహల్గామ్ దాడి అనంతరం భారత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అమెరికాలో పర్యటించారు. అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. అదే సమయంలో, కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశి థరూర్ నేతృత్వంలో ఎంపీలతో కూడిన ఏడు బృందాలు.. దాదాపుగా అన్ని దేశాల్లో పర్యటించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలకు వివరించాయి. టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలను తెలియజేస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాయి.
అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికాలో పర్యటించారు. మార్కో రూబియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో TRF ప్రత్యక్ష ప్రమేయం గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికీ తెలియజేసింది. తద్వారా అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించడం వల్ల చట్టపరంగా చాలా కఠినమైన పరిణామాలను టీఆర్ఎఫ్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఆ సంస్థకు అమెరికన్లు లేదా సంస్థలు ఎటువంటి సహాయం అందించకుండా ఆర్థికపరమైన ఆంక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంస్థకు మద్దతు తెలిపే వారికి అమెరికాలో ప్రవేశం లభించదు.
-
పర్షియన్ గల్ఫ్ దేశాన్ని తుడిచి పెడతాం- ఇంకో రెండు, మూడు వారాలే: తేల్చి చెప్పిన ట్రంప్ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications