భారత్కు అమెరికా భారీ సాయం -ప్రధాని మోదీతో బైడెన్ మంత్రి బ్లింకెన్ భేటీ -ఏం చర్చించారంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్ తరఫున ప్రచారం చేయడం, చివరికి డెమోక్రాట్ జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత కొన్నాళ్ల పాటు ఊగిసలాడిన అమెరికా-భారత్ బంధాలు మళ్లీ గాడినపడుతున్నాయి. బైడెన్ టీమ్ లో ముఖ్యుడు, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అగ్ర రాజ్యం భారీ అదనపు సహాయాన్ని ప్రకటించింది..
కరోనా విలయం నేపథ్యంలో భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారత్ మరికొంత సహాయాన్ని ప్రకటించింది. ఇంతకు ముందు అందించి దానికంటే అదనంగా ఇప్పుడు 25 మిలియన్ డాలర్లు(రూ.186 కోట్లు) సాయం కింద అందిస్తున్నట్లు బుధవారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ తెలిపారు. గతేడాది జూన్లో 41 మిలియన్ డాలర్లను అమెరికా భారత్ కు సాయంగా అందించిన విషయం తెలిసిందే. తాము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్కు అండగా నిలుస్తామని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ తెలిపింది. ఇక,

రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్లింకెన్.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. బ్లింకన్ తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో..ఈ రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ను కలవడం చాలా బాగుంది. భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు జో బైడెన్ యొక్క బలమైన నిబద్ధతను స్వాగతిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంతకుముందు,
ప్రధాని మోదీతో భేటీకి ముందు బ్లింకెన్.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ సమావేశమయ్యారు. భారత్-అమెరికా దేశాల బంధం బలమైనదని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications