Atiq Ahmed: మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ దారుణహత్య: పోలీసులు చూస్తోండగానే బుల్లెట్ల వర్షం
లక్నో: లోక్సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా మరణించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ సమాచారం అందిన వెంటనే ప్రయాగ్ రాజ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ప్రయాగ్ రాజ్కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలు తీసుకుంటోన్నారు. కాల్పులు జరిగిన వెంటనే ప్రయాగ్ రాజ్లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
యూపీ: షూటౌట్ లో మృతి చెందిన మాఫియా లీడర్ అతీక్ అహ్మద్,అతని సోదరుడు..!! pic.twitter.com/ukM93jc0ZD
— oneindiatelugu (@oneindiatelugu) April 15, 2023
అతిక్ అహ్మద్ ప్రస్తుతం జైలులో ఉంటోన్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన తన కుమారుడు అసద్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయన ప్రయాగ్ రాజ్కు చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అష్రాఫ్ అహ్మద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీనితో అతిక్ అహ్మద్ అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్తోండగా.. రాత్రి 10:30 గంటల సమయంలో ఈ కాల్పులు జరిపారు.

అత్యంత సమీపం నుంచి అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి వారిద్దరిపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. పోలీసులు అందరూ చూస్తోండగానే వారిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు. అతిక్ అహ్మద్ తలకు అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడొకడు. ఆ వెంటనే అతను కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న అష్రాఫ్ అహ్మద్పై కాల్పులు జరిపారు.
ఊహించని ఈ ఘటనతో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. నేలపై కుప్పకూలిన అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి పారిపోయారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రయాగ్ రాజ్ పోలీసులు నిర్ధారించారు. వారిని అరెస్ట్ చేశారు.
#WATCH | Uttar Pradesh: Visuals from Prayagraj where Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed were shot dead. pic.twitter.com/RBSDxTk5TY
— ANI (@ANI) April 15, 2023
ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసే క్రమంలో ఎదురు కాల్పులు సైతం చోటు చేసుకున్నాయి. తమను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై హంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాన్ సింగ్ అనే కానిస్టేబుల్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
ఉమేష్ పల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అసద్. ఇటీవలే ఝాన్సీ వద్ద ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతణ్ని ఎన్ కౌంటర్ చేశారు. అసద్తో పాటు అతని సన్నిహితుడు గులామ్ను కూడా కాల్చి చంపారు. ఈ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాటి ప్రకంపనల తీవ్రత తగ్గకముందే ఇప్పుడు ఏకంగా అతిక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications