యూపీలో దారుణం : మహిళను కింద పడేసి... ఆమె మీద కూర్చొని దాడి చేసిన పోలీస్
ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ పట్ల ఓ ఎస్సై వ్యహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట ఆడుతున్నాడన్న ఆరోపణలతో ఆ మహిళ భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె అడ్డుపడింది. దీంతో రెచ్చిపోయిన ఎస్సై ఆమె పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను కింద పడేసి... ఆమె మీద కూర్చొని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
उप्र में भाजपा सरकार के कृपापात्र बने कुछ पुलिसकर्मियों के दुर्व्यवहार से प्रदेश की समस्त पुलिस की छवि धूमिल होती है.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 17, 2021
भाजपा के शासन में दुशासन की कमी नहीं.
घोर निंदनीय! #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/tOmmbpe2RZ
ఈ ఘటనపై బాధిత మహిళ ఆర్తి మాట్లాడుతూ... పేకాట ఆరోపణలతో తన భర్తను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతన్ని విడిచి పెట్టాలంటే లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారని... అందుకు తాము నిరాకరించడంతో తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 'అతను నన్ను చెంపదెబ్బ కొట్టాడు. ఆపై నన్ను ఈడ్చుకెళ్లి కింద పడేశాడు. నా మీద కూర్చొని దారుణంగా కొట్టాడు. మధ్యలో మా గ్రామస్తులు జోక్యం చేసుకుని నన్ను కాపాడారు...' అని వాపోయారు.
మరోవైపు పోలీసుల వాదన భిన్నంగా ఉంది. కాన్పూర్ ఎస్పీ కేశవ్ చౌదరి మాట్లాడుతూ... ఆర్తి భర్త యాదవ్ అతని స్నేహితులు పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో యాదవ్ భార్య ఆర్తి,అతని తల్లి ఎస్సై పటేల్కు అడ్డుపడ్డారని చెప్పారు. ఈ క్రమంలో ఆర్తి కిందపడిపోయిందన్నారు. యాదవ్ను అక్కడినుంచి పారిపోయేలా చేసేందుకే వారు అడ్డుపడ్డారని ఎస్సై భావించినట్లు చెప్పారు. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ జరిగిందన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని... స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఇన్చార్జిగా ఎస్సై పటేల్ను తప్పించామని చెప్పారు.
महिला: "दारोग़ा ने उससे बदतमीज़ी की।"
— Kamal khan (@kamalkhan_NDTV) July 17, 2021
पुलिस : "महिला ने पुलिस से बदतमीज़ी की।उसका कॉलर खींचा तो वह गिर गया।"
कानपुर देहात का मामला।दारोग़ा को लाइनहाजिर कर जांच हो रही है। pic.twitter.com/5IUvGN6MIE
ఇదే ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ... మహిళపై దౌర్జన్యం చేసిన ఆ పోలీస్ అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే యూపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,నేరాలు రాష్ట్రంలో మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. పోలీస్ అధికారులు సైతం మహిళల పట్ల ఇలా దాడులకు పాల్పడటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.