మ్యాగీ డేంజర్: ఉత్తరాఖండ్లో నిషేధం, వివాదం ఎలా మొదలైంది..?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేదాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖాండ్ రాష్ట్రం మ్యాగీ నూడుల్స్పై నిషేధం విధించింది. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మ్యాగీ నూడుల్స్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిన రాష్ట్ర ప్రభుత్వం, అందులో రసాయనాల మోతాదు ఎక్కువగా ఉండటంతో దానిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఉత్తరాఖాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి మ్యాగీ శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓం ప్రకాశ్ తెలిపారు. రాష్ట్రంలోని బిగ్ బజార్లలో మ్యాగీ నూడల్స్ అమ్మకాలను నిలిపివేశారని, చిన్న చిన్న షాపుల్లో నిలిపివేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో 13 మ్యాగీ నూడుల్స్ నమూనాలను పరీక్షించగా 10 నమూనాల్లో సీసం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మ్యాగీ నూడుల్స్పై 15 రోజుల పాటు నిషేధం విధిస్తూ బుధవారం అదేశాలు జారీ చేసింది.
దీంతో ప్రముఖ సూపర్ మాల్స్ అయిన బిగ్ బజార్, కేంద్రీయ భండార్లు దేశవ్యాప్తంగా గల తమ దుకాణాల్లో వీటి విక్రయాలను నిలిపివేశాయి. ఇక మ్యాగీ నూడుల్స్ ప్రచార ప్రకటనల్లో పాల్గొన్న సినీనటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులు నమోదు చేయాలని బీహార్ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలు కూడా మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపించారు.
అసలు మ్యాగీ నూడుల్స్ వివాదం ఎలా మొదలైంది?
భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన మ్యాగీ నూడుల్స్ ఇది. అంతర్జాతీయ కంపెనీ నెస్లే 1947 నుంచే అందిస్తున్న బ్రాండ్. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలనూ బాగా ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మే నెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడంతో ఈ వివాదం మొదలైంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications