వరవరరావుకు ఊరట ... అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్నెల్ల పాటు బెయిల్ మంజూరు
ప్రముఖ రచయిత, విరసం నేత వరవర రావు కి బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్నెల్ల పాటు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు గా జస్టిస్ ఎస్ ఎస్ షిండే , మనీష్ పిటాలేల నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

ముంబైలో అవసరం అయినప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని సూచించిన కోర్టు
కొరెగావ్-భీమా కేసులో రెండేళ్లుగా జైలులో ఉన్న 81 ఏళ్ల కవి కార్యకర్త, విరసం నేత వరవరరావుకు అనారోగ్య కారణాల వల్ల బొంబాయి హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ హైకోర్టు జోక్యం తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చికిత్స అందించటానికి అడ్మిట్ చేసింది ,. బెయిల్ మంజూరు చేసిన కోర్టు వరవరరావును ముంబైలో ఉండాలని మరియు అవసరమైనప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని కోర్టు కోరింది.

వరవరరావు బెయిల్ కోసం భార్య హేమలత ప్రయత్నం
గత కొద్ది రోజులుగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ ఆయన సతీమణి హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ కోసం పలు పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి 1న తీర్పును రిజర్వులో ఉంచింది ఇక తీర్పును ఈ రోజు వెల్లడించింది. సుదీర్ఘ కాలంగా బెయిల్ కోసం పోరాటం చేస్తున్న వరవరరావుకు ఫైనల్ గా బెయిల్ లభించింది .
Recommended Video

గత ఫిబ్రవరి నుండి సంవత్సర కాలంలో 149 రోజులు ఆసుపత్రిలోనే వరవరరావు
అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా వరవరరావుకు బెయిల్ కోసం అతని న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రయత్నిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని బొంబాయి హైకోర్టు ముందు ఎత్తిచూపారు . గత ఫిబ్రవరి నుండి సంవత్సర కాలంలో ఆయన 149 రోజులు ఆసుపత్రిలో గడిపాడు. వరవరరావును మహారాష్ట్రలోని తలోజా జైలు నుండి బయటకు పంపించాలని, అతన్ని ఇంటికి వెళ్లి హైదరాబాద్లో తన కుటుంబంతో కలిసి ఉండటానికి అనుమతించాలని కోర్టును కోరారు.

కోరేగావ్ భీమా హింసకు కారకులంటూ వరవరరావు అరెస్ట్ .. ఆరోపణ ఖండించిన విరసం నేత
ఈ కేసులో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో, డిసెంబర్ 31, 2017 న పూణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ కన్క్లేవ్ లో రెచ్చగొట్టే ప్రసంగాల ఆరోపణలు ఉన్నాయి, మరుసటి రోజు కొరెగావ్-భీమా సమీపంలో హింసకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులతో కలిసి హింసకు కుట్ర పన్నారని వరవరావు, మరో తొమ్మిది మంది కార్యకర్తలపై ఆరోపించారు. విప్లవాత్మక రచయితల సంఘం "విరసం" కు నాయకత్వం వహించిన వరవరరావు ఈ ఆరోపణను తీవ్రంగా ఖండించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications