జాతీయగీతం టైంలో శాల్యూట్ చేయని అన్సారీ: విమర్శలు, వివరణ
న్యూఢిల్లీ: రాజ్పథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శాల్యూట్ చేయక పోవడం పైన సామాజిక మాధ్యమాల్లో సోమవారం నాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలు విమర్శలు వచ్చాయి.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మూడు రంగుల జెండాకు శాల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి సాధారణంగా నిలబడి ఉన్న ఫోటోలు గణతంత్ర వేడకలు ముగిసిన కాసేపటికే ట్విట్టర్లో హల్ చల్ చేశాయి.

దీనిపై హమీద్ అన్సారీ కార్యాలయం వెంటనే స్పందించింది. జాతీయ గీతాలాపన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి శాల్యూట్ చేయవలసిన అవసరం లేదని అందులో తెలిపింది.
ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమంలో ప్రధాన హోదాలో ఉన్నవారు, యూనిఫారంలో ఉన్న వ్యక్తులు జాతీయ గీతాలాపన సమయంలో శాల్యూట్ చేయాలని పేర్కొన్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్నవారు సావధానంలో నిలబడితే చాలని వివరణ ఇచ్చారు. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతి శాల్యూట్ చేశారు. ఉప రాష్ట్రపతి చేయాల్సిన అవసరం లేదని వివరించారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications