జాతీయగీతం టైంలో శాల్యూట్ చేయని అన్సారీ: విమర్శలు, వివరణ
న్యూఢిల్లీ: రాజ్పథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శాల్యూట్ చేయక పోవడం పైన సామాజిక మాధ్యమాల్లో సోమవారం నాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలు విమర్శలు వచ్చాయి.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మూడు రంగుల జెండాకు శాల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి సాధారణంగా నిలబడి ఉన్న ఫోటోలు గణతంత్ర వేడకలు ముగిసిన కాసేపటికే ట్విట్టర్లో హల్ చల్ చేశాయి.

దీనిపై హమీద్ అన్సారీ కార్యాలయం వెంటనే స్పందించింది. జాతీయ గీతాలాపన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి శాల్యూట్ చేయవలసిన అవసరం లేదని అందులో తెలిపింది.
ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమంలో ప్రధాన హోదాలో ఉన్నవారు, యూనిఫారంలో ఉన్న వ్యక్తులు జాతీయ గీతాలాపన సమయంలో శాల్యూట్ చేయాలని పేర్కొన్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్నవారు సావధానంలో నిలబడితే చాలని వివరణ ఇచ్చారు. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతి శాల్యూట్ చేశారు. ఉప రాష్ట్రపతి చేయాల్సిన అవసరం లేదని వివరించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications