ఎట్టకేలకు అమ్ముడుపోయిన మాల్యా లగ్జరీ ప్రయివేటు జెట్ విమానం
లండన్: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు చెందిన లగ్జరీ విమానం ఎట్టకేలకు వేలంలో అమ్ముడుపోయింది. గతంలో రెండుసార్లు ఈ ప్రయివేటు జెట్ విమానాన్ని వేలం వేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈసారి ఓ అమెరికన్ సంస్థ రూ.34.8 కోట్లకు (5.05 మిలియన్ డాలర్లు) బిడ్ వేసింది. బాంబే హైకోర్టు ఈ బిడ్ను ఆమోదించింది.
ఈ డబ్బుతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను రికవరీ చేసుకుంటామని అధికారులు తెలిపారు. విమానాన్ని అమెరికాకు తరలించి ప్రీమియం కస్టమర్లకు సేవలు అందించేందుకు వినియోగిస్తామని అమెరికన్ కంపెనీ తెలిపింది.

విమానం లగ్జరీగా ఉంటుంది. దీని విలువ దాదాపు వంద మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే గత అయిదేళ్లుగా ఇది ప్రయాణించకపోవడం వల్ల ఇప్పుడు ప్రయాణానికి పనికొచ్చే పరిస్థితిలో లేదని తెలుస్తోంది. అందువల్లే విమానం చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది.

ఈ ప్రయివేటు జెట్లో 25 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణం చేయవచ్చు. ఇందులో లగ్జరీ బెడ్రూం, బాత్రూం, సమావేశం నిర్వహించుకునేలా ఏర్పాట్లు వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. సేవా పన్ను విభాగం ఈ విమానాన్ని 2013 సెప్టెంబరులో సీజ్ చేసింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications