ఆసుపత్రిలో విజయ్కాంత్: ఏమైందన్న ఆందోళనలో కార్యకర్తలు!..
డీఎండీకే నేతలు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని అంటున్నారు.
చెన్నై: డీఎండీకే అధినేత, ప్రముఖ సినీ హీరో విజయ్ కాంత్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన మరో రెండు, మూడు రోజులు ఆసుపత్రికి పరిమితమవుతారని తెలుస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అసలు విజయ్ కాంత్ కు ఏమైందన్న ప్రశ్న ఇప్పుడు వారిని కలవరపెడుతోంది.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన ఏది లేకపోవడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే డీఎండీకే నేతలు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జీ అవుతారని వారు చెప్పారు.

విజయ్ కాంత్ ఆరోగ్యం బాగానే ఉందని నేతలు చెబుతున్నప్పటికీ.. కార్యకర్తలు మాత్రం ఆ మాటలు విశ్వసించడం లేదు. ఆరోగ్యం నిలకడగా ఉంటే రెండు, మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. విజయ్ కాంత్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తెలియగానే కార్యకర్తలంతా ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications