తప్పయింది, క్షమించండి:విజయ్కాంత్ ప్రకటన, జర్నలిస్టుల వైపు ఉమ్మేసినందుకు!
విజయ్ కాంత్ ను కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగా.. వారిపై నేరుగా కోపాన్ని ప్రదర్శించలేక, వారి పక్కనే ఉమ్మేశాడు.
చెన్నై: రాజకీయాల్లోకి వచ్చాక గెలుపు మాట అటుంచితే.. వివాదాలు మాత్రం కావాల్సినన్ని మూటగట్టుకున్నారు విజయ్కాంత్. డీఎండీకె పార్టీ అధ్యక్షుడైన విజయ్కాంత్ వైఖరి తొలినుంచి వివాదస్పదంగానే ఉంది. ఆమధ్య తాగింది ఇంకా దిగకముందే ఆయన యోగసనాలు వేసిన తీరు ప్రతీ ఒక్కరిని నోరు వెల్లబెట్టేలా చేసింది.
సరే ఇదంతా పక్కనబెడితే, రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఘటనకు విజయ్కాంత్ తాజాగా క్షమాపణలు చెప్పుకున్నారు. 2015లొ తాను జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరుకు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నట్లు విజయ్ కాంత్ ప్రకటించారు. ఆ సమయంలో విజయ్ కాంత్ ను కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగా.. వారిపై నేరుగా కోపాన్ని ప్రదర్శించలేక, వారి పక్కనే ఉమ్మేశాడు.

దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు విజయ్కాంత్ తీరుపై కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన విజయ్ కాంత్ తన క్షమాపణ ప్రకటనను పీసీఐ ఎదుట రికార్టు చేయించారు. దీంతో కేసును కోర్టు కొట్టివేసిందని విజయ్ కాంత్ లాయర్ జీఎస్ మణి అన్నారు.












Click it and Unblock the Notifications