Interesting:వామ్మో... ఒకేసారి మూడు డజన్ల పిల్లలు పెట్టిన రక్తపింజరి పాము..
చెన్నై/ కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు జూలో ఓ రస్సెల్ వైపర్ జాతికి చెందిన పాము ఏకంగా 33 పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఈ జాతికి చెందిన పాము ఒకేసారి 60 పిల్లలు పెట్టగలదు. సాధారణ పాములకు రక్తపింజరి (రస్సెల్ వైపర్) పాముకు అదే తేడా అని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తపింజరి పాముకు పుట్టిన 33 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ డైరెక్టర్ సెంతిల్ నాథన్ చెప్పారు. అయితే అన్ని పాములను అదే జూకు పరిమితం చేయబోమని చెప్పారు.
ఈ పాములను అటవీశాఖకు అప్పగిస్తామని సెంతిల్ చెప్పారు. అయితే అన్ని పాములు అడవిలో బతికే అవకాశాలు లేవని కూడా చెప్పారు. ఎందుకంటే చిన్న పాములను ఇతర పెద్ద జంతువులు చంపేస్తాయని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఈ జాతికి చెందిన వైపర్ పాము 60 పిల్లలను పెట్టిందని గుర్తు చేశారు సెంతిల్. అది కూడా ఇదే జూలో జరిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నెలలో ఈ వైపర్ పాము కోయంబత్తూరులోని ఓ ఇంట్లోకి నక్కినప్పుడు పాములు పట్టేవారు దీన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకుని జూ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు ఈ పామే 33 పిల్లలకు జన్మనిచ్చింది.
Tamil Nadu: Russell's Viper gives birth to 33 snakelets at VOC Park Zoo in Coimbatore. The snakelets will be let into Anaikatti forest. pic.twitter.com/DJ2Rx8yV4z
— ANI (@ANI) August 8, 2020
ఇదిలా ఉంటే శుక్రవారం రోజున కోయంబత్తూర్ శివార్లలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లోకి వైపర్ జాతికి చెందిన పాము దూరింది. అది ఆవ్యక్తి ఇంట్లోని బాత్రూంలో నక్కి ఉంది. ఇది గమనించిన వ్యక్తి షాక్కు గురయ్యాడు. వెంటనే ఓ పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ పామును పడుతున్న సమయంలో అది 35 పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ పామును అనైకట్టి అటవీప్రాంతంలో వదిలారు. ఈ రస్సెల్ వైపర్ పాము అత్యంత విషపూరితమైనదని అటవీశాఖ అధికారులు చెప్పారు.

రస్సెల్స్ వైపర్ అనే ఈ అత్యంత విషపూరితమైన పాములు భారత ఉపఖండంలో ఎక్కువగా నివసిస్తాయి. అంతేకాదు ఆగ్నేసియా, దక్షిణ చైనా , తైవాన్లో కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి. స్కాట్లాండ్కు చెందిన పాట్రిక్ రస్సెల్ అనే హెర్పటాలజిస్ట్ పేరును ఈ పాములకు పెట్టడం జరిగింది. ఆయన భారత దేశంలో సంచరిస్తున్న పాములపై పరిశోధనలు చేశారు. ఈ పాము నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. ఈ పామును వివిధ భాషల్లో వివిధ పేర్లున్నాయి. తెలుగులో రక్తపింజరి అని పిలుస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications