వైరల్ వీడియో: పడక సుఖం కోసం పాపం.. స్తంభానికి కట్టి కర్రలతో కొట్టి చంపేశారు!

Viral Video: వివాహేతర సంబంధం అనుమానంతో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల వ్యక్తిని కర్ణాటకలోని బీదర్ జిల్లాలో కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహేతర సంబంధం అనుమానంతో జరిగిన దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల యువకుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టి చంపారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేశారు.

మరణించిన యువకుడిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గౌనగావ్ గ్రామానికి చెందిన విషు (Vishu)గా గుర్తించారు. విషును కొట్టిన నిందితులు, అతనికి వివాహేతర సంబంధం ఉన్న మహిళ పూజ కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలోని చింతకి పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు విషు అనేక గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని మొదట చింతకి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ తర్వాత బీదర్ BRIMS ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Viral Video Man Tied to Pole and Beaten to Death Over Extramarital Affair in Karnataka Shocking Incident

వివాహితతో సంబంధం
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విషు తల్లి లక్ష్మి మాట్లాడుతూ.. తన కుమారుడు దాదాపు ఒక సంవత్సరం పాటు పూజ అనే వివాహిత, పిల్లలు ఉన్న మహిళతో సంబంధంలో ఉన్నాడని తెలిపింది. పూజ తన భర్తను విడిచిపెట్టి విషుతో కలిసి జీవించడానికి వచ్చిందని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసని లక్ష్మి పేర్కొంది. అయితే మూడు నెలల క్రితం పూజ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లి, నాగనపల్లిలో ఉంటోంది.

దేవాలయం వద్ద దాడి
లక్ష్మి చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం తన కుమారుడు పూజను కలవడానికి ఇద్దరు స్నేహితులతో కలిసి నాగనపల్లికి వెళ్లాడు. అక్కడ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్నప్పుడు పూజ తండ్రి అశోక్, సోదరుడు గజానన్ విషును అడ్డుకున్నారు. పూజతో సంబంధం పెట్టుకున్నందుకు అతన్ని నిలదీశారు. అనంతరం ఆలయం వెలుపలికి లాక్కెళ్లి, కర్రలతో దాడి చేశారు.

వైరల్ అయిన దాడి వీడియో
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో విషును స్తంభానికి కట్టేసి, అశోక్, గజానన్ కర్రలతో కొడుతుండగా, అతను సహాయం కోసం ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. లక్ష్మి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, చింతకి పోలీసులు మొదట భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 109, 118(1), 352, 127(2) కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+