యూపీలో ఎస్పీకి షాక్.. పోలింగ్ బాయ్కాట్.. కంగుతిన్న అఖిలేశ్ సతీమణి
కన్నౌజ్ : తిరుగులేని చోట సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. ఊహించని పరిణామంతో కంగుతినాల్సి వచ్చింది. అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచిన కన్నౌజ్ సెగ్మెంట్ లో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 20 ఏళ్ల నుంచి అభివృద్ధి జరగలేదన్న కోపం ఓవైపు.. పోలింగ్ కేంద్రాలను మార్చడం మరోవైపు ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో పోలింగ్ను బాయ్కాట్ చేశారు ఓటర్లు. అయితే వరుసగా సమాజ్ వాదీ పార్టీయే ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తుండటం ఆ పార్టీకి కంచుకోటలా మారింది. కానీ ఈసారి ఓటర్లు ఇలా రివర్స్ తిరగడం ఎస్పీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇక ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

ఓటర్ల ఆగ్రహానికి ప్రధాన కారణ పోలింగ్ కేంద్రాలు మార్చడమే. 27, 29 పోలింగ్ బూత్ లను చివరి నిమిషంలో వేరే చోటికి మార్చడంతో స్థానికుల్లో అసహనం పెరిగిపోయింది. అంతేగాకుండా 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. అలా పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీకి వీపరీతంగా పట్టున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications