నిజాలు తెలుసుకోండి: శాంతకుమార్కు శివరాజ్
భోపాల్: మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణంతో భారతీయ జనతా పార్టీ పరువుపోయిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శాంతకుమార్ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు లేఖ రాశారు. ఈ లేఖపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పందించారు.
ఆయన శాంతకుమార్కు మంగళవారం రాత్రి లేఖ ద్వారా జవాబిచ్చారు. నిజానిజాలు తెలియకుండా ప్రతిపక్షాలకు వంత పాడొద్దని లేఖలో పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణం కేసును ప్రత్యేక టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు చౌహాన్ తెలిపారు.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేసిందన్నారు. నిజాయతీగా వ్యవహరిస్తున్న టాస్క్ ఫోర్స్ను సుప్రీం కోర్టు సైతం కొనియాడిందని శివరాజ్ తన లేఖలో పేర్కొన్నారు.

కాగా, శాంతకుమార్ తన లేఖలో ‘ఇటీవలి కాలంలో పార్టీని చుట్టిముట్టిన వివాదాలు పరువు తీస్తున్నాయి' అని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకూ పార్టీలో వివాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉందని చెప్పారు.
ఎథిక్స్ కమిటీ నియామకమూ జరగాలన్నారు. మధ్య ప్రదేశ్లో జరిగిన వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. దీంతో మనమంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజస్థాన్, మహారాష్ట్రలలో చెరరేగిన వివాదాలను కూడా ఆయన గుర్తు చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications