ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..
కోల్కతా : ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకున్నాయి. బెంగాల్లో దీదీ ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పుడుతోందన్న మోడీపై మమత మండిపడ్డారు. మంగళవారం పురూలియాలోని సంతూరీలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంతోనే మోడీ చెంప పగలగొట్టాలని ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు మాట్లాడే ప్రధానికి ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదని మమత జోస్యం చెప్పారు.

హిందువుల పండుగలు, ఉత్సవాలను ఉడ్డుకుంటున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైనా దీదీ స్పందించారు. తాను బీజేపీ నినాదంతో ఏకీభవించనన్న ఆమె... జై శ్రీరాం బదులు జై హింద్ అని నినదిస్తానని చెప్పారు. శ్రీరాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే బీజేపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో ఒక్క రామ మందిరాన్నైనా నిర్మించిందా అని మమత ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications