నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించా, పట్టించుకోలేదు: రఘురాం రాజన్
న్యూఢిల్లీ: నల్లధనం అణచివేసేందుకు గాను పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం కన్నా... తాత్కాలిక నష్టమే ఎక్కువ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని తాను ముందే హెచ్చరించానని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.
నల్లధనం అరికట్టేందుకుగాను మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసే విషయమై తాను ఆర్బిఐ గవర్నర్గా ఉన్న విషయంలో సంప్రదించిందని రఘురామ్ రాజన్ చెరప్పారు.
అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో తాను ముందే హెచ్చరించినట్టు చెప్పారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను తాను ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. అయినా ప్రభుత్వం తన సూచనలను పట్టించుకోలేదని చెప్పారు.

ఐ డూ వాట్ ఐ డూ రిఫార్మ్స్ , రెటారిక్, రిజాల్వ్ పేరిట రాజన్ రాసిన పుస్తకం వచ్చే వారంలో విడుదల కానుంది. 2016 ఫిబ్రవరిలో పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తన అభిప్రాయాన్ని మౌఖికంగా కోరిన విషయాన్ని రఘురాం రాజన్ ప్రకటించారు.
పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడే సమస్యలు, అనువైన సమయం,ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్బిఐ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గత ఏడాది సెప్టెంబర్ 5వ, తేదిన రఘురాం రాజన్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన షికాగో యూనివర్శిటీ బిజినెస్ స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications