VIRAL NEWS..మందుబాబుకు పాము కాటు, సీన్ రివర్స్, ఇంతకీ ఏం జరిగిందంటే..?
వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవును ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసి.. ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఎందుకంటే మనకు పాములు అంటే భయం. ఇక త్రాచు పాము గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదీ కాటు వేస్తే అంతే సంగతులు.. వెంటనే వైద్య సేవలు అందజేయాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం.. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం వింత ఘటన ఒకటి జరిగింది. అదేంటో మీరు చదవి తెలుసుకొండి.
మందుబాబుకు పాము కాటు
ఖుషి నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఆయన ఏం చేశాడో.. కానీ నాగుపాము కరిచింది. ఒకసారి కాదు.. రెండుసార్లు కరిచిందట. కానీ అతనికి ఏమీ కాలేదు. విచిత్రం ఏమిటంటే.. సదరు వ్యక్తికి ఏమీ కాగకపోగా.. కాటు వేసిన పాము చనిపోయిందట. ఇదీ ప్రాబ్లమ్.. అతను జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. జరిగింది వైద్యులకు తెలియజేశాడు. వారిని నమ్మించేందుకు ఆ పామును కూడా తీసుకొచ్చాడు.. దీంతో డాక్టర్లు తల పట్టుకున్నారు.
ఎమర్జెన్సీ వార్డుకు తరలింపు
అతని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అక్కడ చికిత్స అందజేస్తున్నారు. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. అందులో వ్యక్తి ఆస్పత్రి బెడ్ పై ఉన్న విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. తన పాదంపై పాము కాటు వేసిందని.. చికిత్స అందజేయాలని కోరడం కనిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వేలాది లైకులు వచ్చాయి. నెటిజన్లు అదేవిదంగా స్పందించారు.
విష జీవి
పాము విష జీవి. అదీ అంటేనే అందరికీ భయం. ఇక త్రాచు పాము గురించి చెప్పక్కర్లేదు. వెంటనే చికిత్స అందజేయకుంటే 15 నుంచి 20 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. అలాంటిది ఆ పాము కరిచి.. అదే చనిపోవడం ఏంటో అర్థం కావడం లేదు. వైద్యులు ట్రీట్ మెంట్ అందజేస్తున్నారు.. అన్నీ పరీక్షలు చేస్తే గానీ.. ఏం జరిగిందో చెప్పని పరిస్థితి ఏర్పడింది.