ఒంటినిండా బంగారు ఆభరణాలతో సిపిఐ ఎమ్మెల్యే కూతురు , వైరల్ గా మారిన ఫోటో
రాజకీయ నాయకుల ఇళ్ళలో జరిగే వివాహలు అంగరంగ వైభవంగా సాగుతాయి.తమ ఇళ్ళలో పెళ్ళిళ్ళ కోసం రాజకీయనేతలు పెద్ద ఎత్తున ఖర్చుచేస్తారు.అయితే వామపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడ తమ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ఇదే తరహలో ఖ
తిరువనంతపురం:రాజకీయ నాయకుల ఇళ్ళలో జరిగే వివాహలు అంగరంగ వైభవంగా సాగుతాయి.తమ ఇళ్ళలో పెళ్ళిళ్ళ కోసం రాజకీయనేతలు పెద్ద ఎత్తున ఖర్చుచేస్తారు.అయితే వామపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడ తమ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ఇదే తరహలో ఖర్చు చేయడం వివాదాస్పదమౌతోంది.
కేరళ రాష్ట్రంలోని లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే కేరళ కు చెందిన సిపీఐ ఎమ్మెల్యే గీతాగోపి కుమార్తె పెళ్ళి వివాదాస్పదంగా మారింది. ఆదివారం నాడు ఈ వివాహం జరిగింది.
అయితే గీతా గోపి కూతురు ఒంటినిండా బంగారు ఆభరణాలను వేసుకొంది.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిపీఐ ఎమ్మెల్యే తన కూతురు మెడలో భారీగా బంగారు ఆభరణాలను వేసుకోవడాన్ని ఆయన సమర్ధించుకొన్నారు.
రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహిస్తారు.ఈ విషయమై పార్టీ నాయకత్వం కూడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.