‘వెల్డన్’: సిరాదాడి కార్యకర్తలను మెచ్చుకున్న ఉద్ధవ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సోమవారం అరెస్టై బెయిల్పై విడుదలైన తన పార్టీ కార్యకర్తలను మంగళవారం కలిశారు. అనంతరం వారు చేసిన పనిని భినందించారు. పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరి రాసిన 'నెయిదర్ ఎ హాక్ నార్ ఎ డవ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించారు.
కాగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని శివసేన పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ కార్యక్రమ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నలుపు రంగు పోసి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు పాల్పడిన శివసేన కార్యకర్తలు ఆరుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం వారు బెయిలుపై బయటకు రాగానే వారిని ఉద్ధవ్ థాక్రే కలిశారు. మంచి పని చేశారంటూ వారిని ప్రశంసించారు.

అమరులను కించపర్చారు: ఫడ్నివీస్పై సంజయ్ రౌత్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రను అర్థం చేసుకోలేకపోయారని శివసేన ఎంపీ సంజయ్రౌత్ అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం పట్ల శివసేన నిరసన నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్ గట్టి భద్రత కల్పించారు.
కాగా, దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మంత్రికి మద్దతుగా నిలిచి ముంబై పేలుళ్లలో మృతిచెందిన అమరులను ఫడ్నవీస్ కించపరిచారని ఆయన అన్నారు. కసూరికి మద్దతు ఇవ్వడం ద్వారా మనకు ఫడ్నవీస్ చెడ్డపేరు తెచ్చారని అన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications