టెక్కీలకు శుభవార్త: భారీగా ఉద్యోగులను నియమించుకోనున్న ఐటీ కంపెనీలు
న్యూఢిల్లీ: ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీల్లో మందగమనం నేపథ్యంలో ఉద్యోగుల్లో కోత విధిస్తున్న తరుణంలో ఇండియాలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకొంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం మందగమనంలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పులు సాఫ్ట్వేర్ రంగంపై తీవ్ర ప్రభావంాన్ని చూపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను తీసుకొన్న తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయాన్ని ఇండియాకు చెందిన టెక్కీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఇండియాకు చెందిన టెక్కీలపై, సాఫ్ట్వేర్ కంపెనీలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.దీంతో ఇండియాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకొనేపనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి.

భారీగా టెక్కీల రిక్రూట్మెంట్
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల కోత విధిస్తున్న తరుణంలో ఇండియాలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా రిక్రూట్మెంట్ను చేపడుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకొంటున్నాయి. ఈ పరిస్థితి ఇండియన్ టెక్కీలకు ప్రయోజనం కల్గించేదిగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video


యాక్సెంచర్లో 5,396 మందికి ఉద్యోగాలు
యాక్సెంచర్ కంపెనీ ఇండియాలో 5396 మందిని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రాసెస్ను కూడ ప్రారంభించింది.ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని 2649 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది.ఇక ఒరాకిల్ భారత్లో 1124 మందిని నియమించుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఎంఎన్సీలు ఇండియాలో బారీగా రిక్రూట్మెంట్లు
భారత్లో గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్లను కలిగిన బహుళజతి సంస్థలు ఈ ఏడాది భారీగా ఉద్యోగులను నియమించుకొనే అవకాశాలున్నాయని జిన్నోవ్ అంచనావేస్తోంది. ఈ సంస్థలు భారత్లో సుమారు 30వేలకు పైగా ఉద్యోగులను నియమించుకొనే అవకాశాలున్నాయని ఆ సంస్థ అంచనా వేసింది.

ఇండియా సంస్థల్లో ఉద్యోగుల్లో కోత
ఇండియాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోతను విధిస్తున్నాయి. టీసీఎస్, ఇన్పోసిస్, టెక్ మహీంద్ర లాంటి సంస్థలు ఉద్యోగాల్లో కోతను విధిస్తున్నాయి. కానీ, ఎంఎన్సీ సంస్థలు మాత్రం భారీగా ఇండియాలోని తమ శాఖల్లో ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఎంఎన్సీ సంస్థల కారణంగా ఇండియన్ టెక్కీలకు మంచి అవకాశం దక్కనుంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications