మేక్ ఇన్ ఇండియాపై ఆసక్తి: మోడీతో సత్యనాదేళ్ల మళ్లీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల శుక్రవారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం సత్య నాదేళ్ల భారత్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మోడీతో భేటీ అయ్యారు. కాగా, సత్య భారత్లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే అవకాశముంది.
ఇదిలా ఉండగా, సత్య నాదేళ్ల ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఇది రెండోసారి. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గతంలో ఓసారి భారత్ వచ్చారు. అప్పుడు కూడా సత్య నాదేళ్ల ప్రధానితో భేటీ అయ్యారు.
రవిశంకర ప్రసాద్తో సత్య నాదెళ్ల భేటీ
అంతకముందు సత్య నాదెళ్ల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్తో భేటీ అయ్యారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అమెరికా సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్టు కూడా భాగస్వామి కావొచ్చుని చెబుతున్నారు.
రవిశంకర ప్రసాద్తో భేటీ అనంతరం సత్య నాదెళ్ల మాట్లాడారు. ఈ మొబైల్, క్లౌడ్ ప్రపంచంలో ప్రతి భారతీయుడిని భాగస్వామి చేయాలని ఆకాంక్షించారు.
అలాగే భారత దేశంలోని ప్రతి వ్యాపార సంస్థ కూడా కొత్తగా వస్తున్న ప్రతి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా భారత దేశంలో ఉన్న సమయాన్ని తాను అద్భుతంగా భావిస్తానని చెప్పారు. మంత్రితో పలు అంశాలు చర్చించారు.

మోడీతో సత్య నాదెళ్ల
సాఫ్టువేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల శుక్రవారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సత్య నాదెళ్ల కొన్నాళ్ల క్రితం భారత్ వచ్చారు. అప్పుడు కూడా మోడీతో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రితో సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్తో భేటీ అయ్యారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చేపట్టిన విషయం తెలిసిందే.

కేంద్రమంత్రితో సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్తో భేటీ అయ్యారు. కేంద్రమంత్రితో చేయి కలుపుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.

జైట్లీతో నాదెళ్ల
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో శుక్రవారం నాడు సాయంత్రం సమావేశమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. జైట్లీతో చేయి కలుపుతున్న నాదెళ్ల.
-
మెంటల్ మాస్ కాంబో ప్లాన్ చేసిన త్రివిక్రమ్.. వెంకీ మూవీలో 'నారా హీరో' ! -
ఫిబ్రవరిలో కుంభరాశిలోకి సూర్యుడు.. వీరికి మాములుగా ఉండదు! -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల ముహూర్తం : రైతుల ఖాతాల్లో రూ 6 వేలు..!! -
అభిషేక్ శర్మ ఓపెనింగ్ పార్టనర్ ఫిక్స్- తుఫాన్ బ్యాటర్ ఎంట్రీ..!! -
శ్రీశైలం,అరుణాచలం, కంచితో సహా - పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీలు..!! -
గ్రీన్లాండ్ గొడవలో దూరిన రష్యా.. అగ్గిపై పెట్రోల్ పోసిన మంత్రి! -
విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెలెక్షన్ కమిటీ బిగ్ షాక్- చాలా ప్లాన్డ్ గా -
అయ్యో "అల్లు అర్జున్".. రామ్ చరణ్ మూవీ కలెక్షన్స్లో 10 శాతం కూడా రాలేదా !! -
బాంబు పేల్చిన ట్రంప్- 200 శాతం టారిఫ్: నోరెత్తితే ఒట్టు -
ChatGPTకి కులపరమైన పక్షపాతం - ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ - నో వెయిటింగ్, ఇక నుంచి నేరుగా..!!












Click it and Unblock the Notifications