చీతాలు కాదు.. ముందు ఛీటర్లను రప్పించండి స్వామీ..!!
బెంగళూరు: నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పుట్టినరోజును పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడుదల చేశారు. ఎన్క్లోజర్లల్లో ఉన్న వాటికి స్వేచ్ఛ కల్పించారు. అంతరించిపోతోన్న వన్యప్రాణుల జాబితాలో చేరిన చీతాలను సంరక్షించడానికి, వాటి సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతాస్ ప్రాజెక్ట్ను ఆయన ప్రారంభించారు.
కొన్ని ఆఫ్రికన్ దేశాలు, ఇరాన్లో మాత్రమే చీతాల సంఖ్య పరిమితంగా ఉంటోంది. ఒకప్పుడు భారత్- ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. క్రమంగా వాటి సంఖ్య భారీగా తగ్గింది. 1952 నాటికి అవి అంతరించిపోయిన వన్యప్రాణుల జాబితాలో చేరాయవి. దేశీయంగా చీతాల సంతతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కునో నేషనల్ పార్క్ను ఎన్నుకుంది. అక్కడ వాటి సంరక్షణ చర్యలను చేపట్టింది. అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటిని పరిరక్షించనుంది కేంద్రం.

ఈ పరిణామాలన్నింటిపై ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీకి చురకలు అంటించారు. సెటైర్లతో చెలరేగారు. మోదీ స్వదేశానికి రప్పించాల్సింది చీతాలు మాత్రమే కాదని.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులను కూడా పిలిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను ఏ ఛీటర్ల గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా? అని ప్రశ్నించారు.
Dear supreme leader.. when will you get these CHEATahhs.. .. #justasking pic.twitter.com/h1ASmJMgGc
— Prakash Raj (@prakashraaj) September 17, 2022
డియర్ సుప్రీం లీడర్.. అంటూ ప్రధాని మోదీని సంబోధించారు ప్రకాష్ రాజ్. ఈ ఛీటర్లను ఎప్పుడు స్వదేశానికి తీసుకొస్తారు..? అని ప్రశ్నించారు. తన ట్వీట్కు లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ ఫొటోలను జత చేశారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే ఈ ముగ్గురు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోయిన విషయాన్ని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రస్తావించారు.
విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, నీరవ్ మోదీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులను ఎదుర్కొంటోన్నారు. వారిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారులు కేసులు నమోదు చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఇంగ్లాండ్లో నివసిస్తోన్నారు. మేహుల్ చోక్సీ.. అంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటోన్నారు. వారిని స్వదేశానికి రప్పించడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications