Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bharat: భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది?, ఇంకెన్ని పేర్లు ఉన్నాయో తెలుసా?

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు నగరాలు, జిల్లాలు, రాష్ట్రాల పేర్లు మార్చడమే చూశాం. ఇప్పుడు దేశం పేరే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. పలువురు ఇందుకు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పేరు మార్పుతో వచ్చే లాభం ఏంటని అంటున్నారు.

అయితే, ఇండియా పేరుకు ముందు మన దేశాన్ని భారతదేశం అనే పిలిచేవారు. ఇప్పుడు కూడా పిలస్తున్నారు. అయితే, బ్రిటీష్ వారు దురాక్రమణ చేసిన సమయంలో భారత్ పేరును ఇండియాగా పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆ పేరునే అధికారికంగా వాడకం మొదలుపెట్టింది మనదేశ ప్రభుత్వం కూడా. ఇప్పుడు తాజాగా, మరోసారి దేశ పాత పేరునే కొనసాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 Bharat

కాగా, "భారత్", "భారతదేశం" లేదా "భారతవర్ష" మూలాలు పురాణ సాహిత్యం, ఇతిహాసమైన మహాభారతం నుంచి గుర్తించబడ్డాయి. పురాణాలు.. "దక్షిణాన సముద్రం, ఉత్తరాన మంచు నివాసం" మధ్య ఉన్న భూమిగా భారతదేశాన్ని వర్ణిస్తాయి.

సామాజిక శాస్త్రవేత్త కేథరీన్ క్లెమెంటిన్-ఓజా భరతాన్ని రాజకీయ లేదా భౌగోళికంగా కాకుండా మతపరమైన, సామాజిక-సాంస్కృతిక అస్తిత్వంలో వివరించారు. 'భారత' అనేది "సమాజంలో బ్రాహ్మణీయ వ్యవస్థ ప్రబలంగా ఉన్న సుప్రరీజినల్, సబ్‌కాంటినెంటల్ భూభాగాన్ని సూచిస్తుంది' అని క్లెమెంటిన్-ఓజా తన 2014 వ్యాసంలో 'ఇండియా.. అది భారత్...': ఒక దేశం, రెండు పేర్లు'లో పేర్కొన్నారు.

జనవరి 1927లో వ్రాస్తూ.. జవహర్‌లాల్ నెహ్రూ "సుదూర గతం" నుంచి కొనసాగిన "భారతదేశపు ప్రాథమిక ఐక్యత" గురించి ప్రస్తావించారు. "ఒక ఉమ్మడి విశ్వాసం, సంస్కృతి ఐక్యత. ఇండియా అంటే భారతదేశం, హిందువుల పవిత్ర భూమి, హిందూ తీర్థయాత్ర గొప్ప ప్రదేశాలు భారతదేశంలోని నాలుగు మూలల్లో ఉన్నాయి. సిలోన్‌కి ఎదురుగా ఉన్న దక్షిణం, అరేబియా సముద్రం, తూర్పున కడుగుతున్న తీవ్ర పశ్చిమ ప్రాంతం. బంగాళాఖాతం, హిమాలయాల్లో ఉత్తరం వైపు వ్యాపించి ఉందని వివరించారు.

కాగా, హిందుస్తాన్ అనే పేరు సింధు లోయ (ఉపఖండంలోని వాయువ్య భాగాలు)పై అచెమెనిడ్ పర్షియన్ విజయంతో కరెన్సీలోకి వచ్చిన సంస్కృత 'సింధు' (సింధు) పర్షియన్ సహసంబంధమైన రూపమైన 'హిందూ' నుంచి ఉద్భవించిందని భావిస్తున్నారు. 6వ శతాబ్దం బీసీ (ఇది గంగా పరీవాహక ప్రాంతంలో బుద్ధుని కాలం).

అచెమెనిడ్స్ దిగువ సింధు పరీవాహక ప్రాంతాన్ని గుర్తించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. క్రైస్తవ శకం మొదటి శతాబ్దం నుంచి.. "హిందుస్తాన్" సృష్టించడానికి "స్థాన్" అనే ప్రత్యయం పేరుతో ఉపయోగించారు.

అచెమెనిడ్స్ నుంచి హింద్ అనే జ్ఞానాన్ని పొందిన గ్రీకులు ఆ పేరును 'సింధు' అని లిప్యంతరీకరించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మాసిడోనియన్ రాజు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తే సమయానికి, 'భారతదేశం' సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతంతో గుర్తింపు పొందింది.

ప్రారంభ మొఘలుల కాలం (16వ శతాబ్దం) నాటికి, మొత్తం ఇండో-గంగా మైదానాన్ని వర్ణించడానికి 'హిందూస్థాన్' అనే పేరు ఉపయోగించారు. చరిత్రకారుడు ఇయాన్ జె బారో తన వ్యాసంలో.. 'ఫ్రమ్ హిందుస్థాన్ టు ఇండియా: నేమింగ్ చేంజ్ ఇన్ ఛేంజ్ ఇన్ నేమ్స్' (జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్, 2003) ఇలా రాశారు. "పద్దెనిమిదవ శతాబ్దం మధ్య నుంచి చివరి వరకు, హిందుస్థాన్ తరచుగా భూభాగాలను సూచించేది. మొఘల్ చక్రవర్తి, ఇది దక్షిణాసియాలోని చాలా భాగాన్ని కలిగి ఉంది అని పేర్కొన్నారు.

18వ శతాబ్దం చివరి నుంచి, బ్రిటీష్ మ్యాప్‌లు 'ఇండియా' అనే పేరును ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించాయి. ఇక, 'హిందుస్థాన్' అనే పదం దక్షిణాసియా అంతటితో తన అనుబంధాన్ని కోల్పోవడం ప్రారంభించింది.

 Bharat:

కాగా, సంకల్పం చెప్పేటప్పుడు మాత్రం.. "జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోఃదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య, ఆగ్నేయ ప్రదేశే అని ఆయా ప్రాంతాల ఉనికిలో భాగంగా 'కృష్ణాగోదావరీ మధ్య దేశే' అని కలిపి చెబుతారు. కొన్ని ప్రాంతాలవారు 'శ్రీ కృష్ణాకావేరియోః మధ్య ప్రదేశే అని సంకల్పంలో చెబుతారు. జంబూద్వీపం అనేది కేవలం భారత ఉపఖండం మాత్రమే కాదు. జంబూద్వీపంలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబూద్వీపాన్ని 9 భౌగోళిక ప్రాంతాలుగా విభజించారు. వాటిలో భరతవర్షం ఒకటి. ఇది మొత్తము 9 ద్వీపాల సముదాయం. స్పష్టంగా చెప్పాలంటే భారత్ అనే పేరు వేదకాలం నుంచే వాడుకలో ఉంది.

అయితే, మన దేశానికి ఎన్నో పేర్లున్నప్పటికీ భారత్ అనేది ప్రత్యేకం. జంబూద్వీపం, భరత ఖండం, అజనాభవర్ష్, హిమవర్షం, భారతవర్ష్, ఆర్యవర్ష్, ఆర్యవర్తం, హిందూ, హిందుస్థాన్, ఇండియా... ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. వీటిలో కొన్ని శ్లోకాల్లో ప్రస్తావించారు. అయితే ఎక్కువగా వాడుకలో ఉన్నది మాత్రం భారత్ అనే పేరే. మనదేశంలో ఉన్న వైవిధ్య సంస్కృతుల్లాగే వివిధ కాలాల్లో రకరకాల పేర్లు వచ్చాయి. ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతి స్ఫూర్తితో, ఇంకోసారి ఆచార వ్యవహారాల వల్ల కూడా హిందూ, హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇండియా, హిందుస్తాన్ పేర్లు రావడానికి మూలం సింధు నది.

భరతుడి పేరుతో భారత్

భరతుడు భారతీయుల ఋగ్వేద తెగకు పూర్వీకుడు, పొడిగింపుగా, ఉపఖండంలోని ప్రజలందరికీ మూలపురుషుడు అయిన పురాతన పురాణ రాజు పేరు. భరతుడు పాలించడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చిందంటారు చరిత్రకారులు. దశరథుడి తనయుడు, శ్రీరాముడి సోదరుడు కాదు ఈ భరతుడు. శకుంతల-దుష్యంతుల పుత్రుడు. భరతుడి పేరుమీదే భారత్‌గా మారిందని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని సువిశాల సామ్రాజ్యం స్థాపించాడు. ఆయన పేరు మీదే ఆయన రాజ్యానికి భారతవర్ష్ అనే పేరు వచ్చింది.

మరోవైపు, మత్స్యపురాణంలో భారత్ ప్రస్తావన ఉందని చెబుతారు. జైన సంప్రదాయ సూత్రాలు కూడా భారత్ పేరులో కనిపిస్తాయి. భగవాన్ రుషభదేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరుమీదే ఈ దేశానికి భారతవర్ష్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. ఇక, దాదాపు 2500 ఏళ్ల క్రితం మహాభారత సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దులో ఉన్న అన్ని సామ్రాజ్యాలూ పాల్గొన్నాయి. అందుకే దీన్ని మహాభారత్ అని పేర్కొన్నారు. కాగా, దేశం పేరు మార్పు తెరపైకి రావడంతో చాలా శతాబ్దాల తర్వాత మరోసారి భారత్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+