వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా ఎవరు, గుజరాత్ కు ఇచ్చాం, అడిగామా: కామన్ సెన్స్ ఉందా: సీఎం సిద్దూ ఫైర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మా రాష్ట్రానికి చెందిన ఖర్చుల లెక్కలు అడగటానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరు ? గుజరాత్ కు నిధులు ఇచ్చాము, మేము అడిగామా ? అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. కొంత కామన్ సెన్స్ తో మాట్లాడితే బాగుంటుందని సీఎం సిద్దరామయ్య అమిత్ షాకు షాక్ ఇచ్చారు.

Recommended Video

అమిత్ షా ఫైర్: కన్నడ అనువాదంతో తుస్
మాడబ్బు మాకిచ్చారు !

మాడబ్బు మాకిచ్చారు !

మైసూరు జిల్లా హెచ్ డీ కోటే తాలుకా సరగూరులో గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల విమర్శలను తిప్పికోట్టారు. తాము చెల్లిస్తున్న ఆదాయపన్నులోనే కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాకు నిధులు మంజూరు చేస్తున్నదని సీఎం సిద్దరామయ్య అన్నారు.

గుజరాత్ కు ఇచ్చాం, అడిగామా ?

గుజరాత్ కు ఇచ్చాం, అడిగామా ?

మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పని చేసిన సమయంలో గుజరాత్ కు కేంద్రం నిధులు మంజూరు చేసిందని సిద్దరామయ్య గుర్తు చేశారు. గుజరాత్ కు విడుదలైన నిధుల గురించి మేము అడిగామా, ఏం అయ్యిందని ప్రశ్నించామా అని సిద్దరాయ్య అమిత్ షాపై మండిపడ్డారు.

 మా ప్రజలకు చెబుతాం !

మా ప్రజలకు చెబుతాం !

తమ ప్రభుత్వం నిధులు ఎంత ఖర్చు చేసింది అనే విషయం కర్ణాటక ప్రజలకు చెబుతామని, అమిత్ షాకు కాదని సిద్దరామయ్య ఘాటుగా సమాధానం ఇచ్చారు. బుధవారం బీజేపీ పరివర్తనా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిద్దరాయ్య ప్రభుత్వంపై విమర్శలు చేశారు

స్వాహా చేసిన కాంగ్రెస్

స్వాహా చేసిన కాంగ్రెస్

కేంద్రం కర్ణాటకకు మంజూరు చేసిన 2 లక్షల కోట్ల నిధులు సీఎం సిద్దరామయ్యతో సహ కాంగ్రెస్ నాయకులు స్వాహా చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించడంతో సీఎం సిద్దరామయ్య ఆయనకు ఇలా ఘాటుగా ఎదురు సమాధానం ఇచ్చారు.

సీఎం లూటీ చేశారు

సీఎం లూటీ చేశారు

కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం అభివృద్ది కోసం మంజూరు చేసిన నిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారని, ఎక్కడా అభివృద్ది చెయ్యలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

English summary
Who is Amit Shah to ask state government expenses? Did we ask about Gujarat state expenses while Manmohan Singh was PM, asks Karnataka CM Siddaramaiah in Saragur, HD Kote taluk, Mysuru district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X