కొత్త సీఎంపై నెలకొన్న ఉత్కంఠ : మోడీ మొగ్గు ఎవరి వైపు?
న్యూఢిల్లీ : గుజరాత్ సీఎం ఆనందీ బెన్ రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు మూడు రోజుల్లోనే కొత్త సీఎం ఎంపిక ఖరారవుతుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సీఎం రేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
అయితే జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ వ్యవహారాలను చక్కదిద్దుతోన్న అమిత్ షా కు.. సీఎం బాధ్యతలు అప్పగించి గుజరాత్ కే పరిమితం చేయడానికి ప్రధాని మోడీ మొగ్గు చూపుతారా..? అన్నది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం గుజరాత్ లోని నారన్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమిత్ షా ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇక అమిత్ షా తర్వాత రేసులో.. పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీఎంగా అమిత్ షా కు పగ్గాలు అప్పజెప్పకపోతే ఈ ఐదుగరిలో ఒకరిని సీఎం పదవి వరించడం ఖాయమన్న చర్చ జోరందుకుంది. అమిత్ షా కంటే సీనియరైన పురుషోత్తం రూపాల రేసులో మిగతావారికంటే ముందున్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంలోను మోడీ తర్వాత పురుషోత్తం ధిట్ట అనే పేరు కూడా ఉంది.

రాజకీయానుభవంలోను అమిత్ షా కంటే సీనియర్ అయిన పురుషోత్తం ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తోన్నా..! గడిచిన కొంతకాలంగా బీజేపీలో ఆయన ప్రభ తగ్గిపోయినట్లుగా చెప్పుకుంటారు. తాజాగా ఆనందీ బెన్ రాజీనామా ఆయనకు కలిసొచ్చి సీఎంగా గనుక బాధ్యతలు చేపడితే మళ్లీ ఆయన రాజకీయ ప్రభ పునర్వైభవం సంతరించుకునే అవకాశాలున్నాయి.
ప్రస్తుత గుజరాత్ రాజకీయాల్లో ఆనందీ బెన్ తర్వాత నంబర్ టూ గా కొనసాగుతూ వస్తోన్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ తో ఆయనకున్న సంబంధాలు సీఎం పదవికి ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక జైన్ సామాజిక వర్గానికి చెందిన గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా సీఎం అభ్యర్థుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ సంక్షోభాలను సమర్థవంతంగా చక్కదిద్దగలడన్న పేరు విజయ్ రూపానికి ఉండడం రేసులో ఆయనకు కలిసొచ్చే అంశం.
గుజరాత్ లో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య ప్రధాన అనుసంధానకర్తగా.. మోడీ సీఎంగా కొనసాగిన కాలంలో బలమైన నేతగా ముద్రవేసిన గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి భిక్షురాయ్ దాల్సానియా పేరు కూడా సీఎం అభ్యర్థుల జాబితాలో వినిపిస్తోంది. జాబితాలో వినిపిస్తోన్న పేర్లలో ఒక్క ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరికి మాత్రమే దాదాపుగా అవకాశాలు లేవని తెలుస్తున్నా.. మిగతావారి విషయంలో స్పష్టత లేదు. ఉత్కంఠగా మారిన కొత్త సీఎం చర్చకు బీజేపీ ఎలాంటి నిర్ణయంతో ముగింపు పలుకుతుందో తెలియాలంటే ఇంకో రెండు మూడు రోజులు వేచి చూడక తప్పదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications