నేను ఎందుకు ఖండించాలి: రేప్ వ్యాఖ్యలపై దేవెగౌడ
బెంగళూర్: అత్యాచారం కేసు దోషులకు ఉరిశిక్ష వేయకూడదనే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యలను ఖండించడానికి మాజీ ప్రధాని, జెడిఎస్ నేత హెచ్డి దేవెగౌడ నిరాకరించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ములాయం సింగ్కు ఉందని, ప్రతి రాజకీయ పార్టీకి తమవైన అభిప్రాయాలుంటాయని, వాటిని తాను ఎందుకు ఖండించాలని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
చివరగా సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. జెడిఎస్ లోకసభ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసే సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరణశిక్ష అంశం సుప్రీంకోర్టు వద్ద పెండింగులో ఉందని, దానిపై వ్యక్తులు నిర్ణయం తీసుకోలేరని, సుప్రీంకోర్టు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.

అత్యాచార నేరాలు దేశ గౌరవాన్ని మంట కలుపుతాయని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా భారత ప్రతిష్టపై దెబ్బ పడుతోందని ఆయన అన్నారు. పార్లమెంటు తెచ్చిన చట్టం వల్ల కూడా అత్యాచారాలు తగ్గలేదని, ఆ సంఘటనలను అది అరికట్టలేకపోయిందని ఆయన అన్నారు.
అటువంటి అమానుషమైన నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందరం చర్చించాల్సి ఉంటుందని, ప్రపంచంలో భారత ప్రతిష్టను కాపాడాలని దేవెగౌడ అన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications