Wife: ఫ్యామిలీ ఫైటింగ్, భార్య, అత్తమామలను స్పాట్ లో కాల్చి చంపేసిన సెక్యూరిటీ, అసలు మ్యాటర్ ఏదంటే!
జలంధర్/ పంజాబ్: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఓపాప ఉంది. పాప పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసి కొన్ని సంవత్సరాలు దంపతుల కాపురం నిలబెట్టారు. అయితే కలిసి ఉన్న సమయంలోనే దంపతులు చాలాకాలం మాట్లాడుకోలేదు. తరువాత భార్య ఆమె భర్తను వదిలేసి వేరుగా ఉంటున్నది. నా భార్య తనను వదిలేసిందని భర్త రగిలిపోయాడు.
భార్య ఇంటికి వెళ్లిన భర్త ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అదే సమయంలో భార్య తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను తుపాకితో కాల్చి స్పాట్ లో చంపేశాడు.
పెద్దలు సెట్ చేసిన పెళ్లి
పంజాబ్ లోని జలంధర్ లోని శివనగర్ కాలనీలో సునీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను సునీల్ వివాహం చేసుకున్నాడు. పెద్దలు సెట్ చేసిన సుప్నాను పెళ్లి చేసుకున్న సునీల్ అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు.
దంపతులు ఎదురుపడితే రాయి టెంకాయి
సునీల్, స్వప్నా దంపతులకు ఓపాప ఉంది. పాప పుట్టిన తరువాత స్వప్నా, సునీల్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసి కొన్ని సంవత్సరాలు సునీల్, స్వప్నా దంపతుల కాపురం నిలబెట్టారు. అయితే కలిసి ఉన్న సమయంలోనే సునీల్ అతని భార్య చాలాకాలం మాట్లాడుకోలేదు, కానీ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని తెలిసింది.
వేరుగా కాపురం ఉంటున్న భార్య
సునీల్ జలంధర్ లోనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. రానురాను సునీల్, స్వప్నా దంపతుల మ్యద గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. తరువాత స్వప్నా ఆమె భర్త సునీల్ ను వదిలేసి జలంధర్ లోనే వేరుగా ఉంటున్నది. నా భార్య తనను వదిలేసిందని సునీల్ ఇంకా కోపంతో రగిలిపోయాడు.
భార్య, తల్లిదండ్రులను చంపేశాడు
భార్య స్వప్నా ఇంటికి వెళ్లిన సునీల్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అదే సమయంలో భార్య స్వప్నా తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో సునీల్ కు, అతని భార్య, ఆమె తల్లిదండ్రులు మాటామాటా పెంచుకోవడంతో గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సునీల్ అతని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను తుపాకితో కాల్చి స్పాట్ లో చంపేశాడు
అదే ఇంట్లో మకాం వేసిన భర్త
భార్య, అత్తమామలను హత్య చేసిన సునీల్ తప్పించుకోకుండా అదే ఇంట్లో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సునీల్ ను అరెస్టు చేసి అతని తుపాకిని స్వాధీనం చేసుకున్నారని డిప్యూటీ పోలీసు కమీషనర్ జగ్ మోహన్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.