అక్రమ సంబంధం: ఫ్రెండ్ భర్తతో కలిపి కట్టుకున్నవాడిని చంపేసింది
న్యూఢిల్లీ: తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించిన ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పెట్రోలింగ్ పోలీసులు గ్యాంగ్ నెహర్ ప్రాంతంలో చెక్ చేస్తున్నారు.
అందులో భాగంగా ఓ వాహనాన్ని ఆపి చెక్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేల రూపాయలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేసింది. రాత్రి భోజనం చేసిన అనంతరం భార్య తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది.
అతడు నిద్రలోకి వెళ్లగానే తన స్నేహితురాలు, ఆమె భర్త, మరో కిరాయి హంతకుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపింది. అనంతరం అతడికి బురఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో వారు వాహనంలో పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులను, అతని భార్యను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.