boyfriend: భర్తకు టాటా చెప్పి అబ్బాయిని సెట్ చేసుకున్న ఆంటీ, పెళ్లి వయసుకు వచ్చిన కూతుర్ని ?
లక్నో/ ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. రానురాను దంపతుల మద్య గొడవలు జరిగాయి. దంపతుల మద్య రాజీ చెయ్యడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే దంపతులు మాత్రం కలిసి ఉండలేక విడిపోయారు. భార్య ఆమె కూతురితో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. పెళ్లి వయసుకు వస్తున్న కూతురిని ఇంట్లో పెట్టుకున్న ఆమె తల్లి ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడైన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. తల్లి అక్రమ సంబంధానికి కూతురు అభ్యంతరం చెప్పింది. అంతే కొన్ని రోజులకే కూతురు శవమైయ్యింది.
దంపతులకు కూతురు
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో సునీల్ వర్మా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 ఏళ్ల క్రితం సుశీల్ వర్మా స్మృతి రాణి వర్మా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సుశీల్ వర్మా, స్మృతి రాణి వర్మా దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. సుశీల్ వర్మా స్మృతి రాణి వర్మా దంపతులకు ఖుష్బూ (16) అనే కుమార్తె ఉంది.
భర్తకు గుడ్ బై చెప్పింది
రానురాను సుశీల్ వర్మా స్మృతి రాణి వర్మా దంపతుల మద్య గొడవలు జరిగాయి. సుశీల్ వర్మా స్మృతి రాణి వర్మా దంపతుల మద్య రాజీ చెయ్యడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే సుశీల్ వర్మా స్మృతి రాణి వర్మా దంపతులు మాత్రం కలిసి ఉండలేక విడిపోయారు. చివరికి సుశీల్ వర్మాతో అతని భార్య స్మృతి రాణి వర్మా తెగతెంపులు చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
ప్రియుడిని సెట్ చేసుకున్న ఆంటీ
తల్లి స్మృతి రాణి, తండ్రి సుశీల్ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉండటంతో వారి కుమార్తె ఖుష్బూ ఆవేదన చెందింది. ఇదే సమయంలో స్మృతి రాణి ఆమె భర్త సుశీల్ వర్మాతో విడిపోయి కూతురు ఖుష్పూ వర్మాతో కలిసి వేరే ఇంటిలో జీవిస్తోంది. తరువాత స్మృతి రాణి ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడైన అనిల్ కుమార్ అనే అబ్బాయితో పరిచయం పెంచుకుని రానురాను అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
మమ్మీ మ్యాటర్ నచ్చలేదని చెప్పిన ఖుష్బూ ?
చిన్న అబ్బాయితో తన తల్లి స్మృతి రాణికి ఎఫైర్ ఉందని, కాలక్రమేణా అది ఎక్కువ అయ్యిందని తెలుసుకున్న కుష్బూ ఏమీ చెయ్యలేక కొంతకాం మౌంగా ఉండిపోయింది. తల్లి స్మృతి రాణి, అనిల్ కుమార్ అక్రమ సంబంధం కూతురు ఖుష్బుకి నచ్చలేదు. ఇదే విషయంలో ఖుష్బూ ఆమె తల్లికి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో అక్కడ స్మృతి రాణికి మండిపోయింది.
కూతుర్ని చంపి ఆంటీ డ్రామాలు....... మాజీ భర్త దెబ్బతో
ఆనెల 21వ తేదీన స్మృతి రాణి వర్మ కుమార్తె ఖుష్బు వర్మా ఆమె ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందని తల్లి అందరికి ఫోన్లు చేసి చెప్పింది. కూతురు ఖుష్బూ ఆత్మహత్య చేసుకుందని తల్లి స్మృతి రాణి మనస్తాపానికి గురైనట్లు నటించింది. అయితే ఖుష్బూ తండ్రి డ్రి సుశీల్ వర్మాకు అనుమానం వచ్చింది. స్మృతి రాణి, ఆమె ప్రియుడు అనిల్ కుమార్ తన కూతురు ఖుష్బూను హత్య చేశారని సుశీల్ వర్మా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అవును మేమే చంపేశాము
పోలీసులు జరిపిన విచారణలో ఖుష్బును తామే హత్య చేసినట్లు స్మృతి రాణి, ఆమె ప్రియుడు అనిల్ కుమార్ అంగీకరించారు. ఆ తర్వాత పోలీసులు స్మృతి రాణి, ఆమె ప్రియుడు అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి మొరాదాబాద్ జైలులో పంపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డుపడుతోందని తన ప్రియుడితో కలిసి పెళ్లి వయసుకు వస్తున్న కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి డ్రామాలు ఆడటం హాట్ టాపిక్ అయ్యింది.