Wife: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యోగం లేని టెక్కీ, భార్యకు చివరి మెసేజ్ ఏం పంపించాడంటే?, అంతే!
భోపాల్/ మధ్యప్రదేశ్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకోవడానికి ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చని ఆమె అనుకుంది. ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న ఆమె సంతోషంగా కాపురం చేస్తోంది. అటవి శాఖలో భార్యకు మంచి ఉద్యోగం వచ్చింది. అయితే భర్త మాత్రం ఉద్యోగం సంపాధించలేకపోయాడు. ఉద్యోగం సంపాదించాలని భర్త అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాధించిన భార్య ప్రతినెల జీతం తీసుకువస్తున్నది.
నువ్వు పనిపాట లేకుండా ఇంట్లో కుర్చుని నేను సంపాధిస్తున్న డబ్బుతో కాలం గడిపేస్తున్నావని భార్య సూటిపోటి మాటలు మాట్లాడింది. వివాహం జరిగిన రెండు సంవత్సరాలకే దంపతుల మద్య మనస్పర్థలు వచ్చాయి. పెద్దలు రాజీ చేసినా దంపతులు మాత్రం గొడవలు పడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో విడాకులు తీసుకోవాలని దంపతులు కోర్టును ఆశ్రయించారు. విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించిన దంపతులు ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారు.
ఉదయం భార్య ఉద్యోగానికి వెళ్లిపోయింది. తరువాత భార్యకు వాట్సాప్ లో మెసేజ్ చేసిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకునే భర్తే కదా అంటూ పట్టించుకోని భార్య మరుసటి రోజు వాట్సాప్ లో అతను పంపించిన మెసేజ్ చూసింది. అప్పటికే భర్త ఇంట్లో శవమై కనిపించాడు. భర్త ఆత్మహత్య చేసుకునే ముందు భార్యకు పంపించిన మెసేజ్ చూసిన అతని కుటుంబ సభ్యులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లికి గ్రీన్ సిగ్నల్
మధ్యప్రదేశ్ లోని హార్దాలో సతీష్ బిజేడా అలియాస్ సతీష్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. సతీష్ బీటెక్ పూర్తి చేశాడు. చిత్ వారాలో నివాసం ఉంటున్న సమోత తివారి అనే యువతి బాగా చదువుకుంది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన సతీష్ ను పెళ్లి చేసుకోవడానికి ఉన్నత చదువులు చదువుకున్న సమోత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సంతోషంగా కాపురం చెయ్యాలని అనుకున్నారు
ఇంజనీరింగ్ పూర్తి చేసిన సతీష్ ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చని సమోత అనుకుంది. 2020 జూన్ లో ఇంజనీర్ సతీష్ ను పెళ్లి చేసుకున్న సమోత సంతోషంగా కాపురం చేస్తోంది. అటవి శాఖలో సమోతకు మంచి ఉద్యోగం వచ్చింది. అయితే సతీష్ మాత్రం ఉద్యోగం సంపాధించలేకపోయాడు. ఉద్యోగం సంపాదించాలని సతీష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.
భార్య సూటిపోటి మాటలు
ప్రభుత్వ ఉద్యోగం సంపాధించిన సమోత ప్రతినెల జీతం తీసుకువస్తున్నది. నువ్వు పనిపాట లేకుండా ఇంట్లో కుర్చుని నేను సంపాధిస్తున్న డబ్బుతో కాలం గడిపేస్తున్నావని సమోత ఆమె భర్త సతీష్ ను సూటిపోటి మాటలు మాట్లాడింది. వివాహం జరిగిన రెండు సంవత్సరాలు కాకుండానే సతీష్, సమోత దంపతుల మద్య మనస్పర్థలు వచ్చాయి.
విడాకుల కోసం కోర్టులో అర్జీ
పెద్దలు రాజీ చేసినా సతీష్, సమోత తివారి దంపతులు మాత్రం గొడవలు పడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో విడాకులు తీసుకోవాలని సతీష్, సమోత దంపతులు కోర్టును ఆశ్రయించారు. విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించిన సతీష్, సమోత దంపతులు ప్రస్తుతం హార్దాలోనే ఒకే ఇంట్లో ఉంటున్నారు.
నువ్వు వేరే పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండాలని భార్యకు మెసేజ్
ఉదయం సతీష్ భార్య సమోత ఉద్యోగానికి వెళ్లిపోయింది. తరువాత భార్య సమోతకు వాట్సాప్ లో మెసేజ్ చేసిన సతీష్ నువ్వు మంచి ఉద్యోగం ఉన్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని, నువ్వు జీవితాంతం సుఖంగా ఉండాలని, అదే నా చివరికి కోరిక అంటూ మెసేజ్ పంపించిన సతీష్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిర్లక్షం చేసిన భార్య?
విడాకులు తీసుకునే భర్తే కదా అంటూ పట్టించుకోని భార్య సమోత మరుసటి రోజు వాట్సాప్ లో సతీష్ పంపించిన మెసేజ్ చూసింది. అప్పటికే భర్త సతీష్ అతని ఇంట్లో శవమై కనిపించాడు. భర్త సతీష్ ఆత్మహత్య చేసుకునే ముందు భార్యకు పంపించిన మెసేజ్ చూసిన అతని కుటుంబ సభ్యులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు.