Wife: దంపతులు ఇద్దరూ టెక్కీలు, రాత్రి లేటుగా ఇంటికి వెళ్లిన భర్త, గంటలోనే భార్యను చంపేసిన ఇంజనీర్ !
పూణే/ లక్నో: యువతి, యువకుడు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. యువతి, యువకుడి కులం ఒక్కటే కావడంతో పెద్దలు వారి పెళ్లి జరిపించారు. కొంతకాలం సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు చేసిన దంపతులు తరువాత వేరే రాష్ట్రంలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న దంపతులు సంతోషంగానే ఉంటున్నారు. భర్తకు మద్యం సేవించే అలవాటు ఉంది. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో టెక్కీ భార్య, కూతురు ఉన్నారు. ఆ సందర్బంలో దంపతుల మద్య గొడవ జరిగింది. కూతురి కళ్ల ముందే టెక్కీ అతని భార్యను దారుణంగా చంపేడయం కలకలం రేపింది.
Illegal affair: ప్రియుడి కోసం మొగుడిని ఏం చేసిందంటే ?, అర్దరాత్రి హైడ్రామా, నాటకాలు, కట్ చేస్తే !
దంపతులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు
ఉత్తరప్రదేశ్ లో శివమ్ పంకజ్ పచౌరి అలియాస్ భరద్వాజ్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. భరద్వాజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోనే అవంతిక (30) అనే యువతి నివాసం ఉంటున్నది. అవంతకి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. భరద్వాజ్, అవంతికల కులం ఒక్కటే కావడంతో ఐదు సంవత్సరాల క్రితం ఇద్దరికి పెద్దలు పెళ్లి జరిపించారు.
పూణేలో కాపురం
భరద్వాజ్, అవంతిక దంపతులకు మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. పాపతో కలిసి ఉత్తరప్రదేశ్ లోనే సంతోషంగా జీవిస్తున్న భరద్వాజ్, అవంతిక దంపతులు రెండు సంవత్సరాల క్రితం పూణేలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. రెండు సంవత్సరాల క్రితం భరద్వాజ్, అవంతిక దంపతులు పూణేకి మకాం మార్చారు.
రాత్రి ఏం జరిగిందంటే ?
పూణేలోని హింజేవాడిలోని అపార్ట్ మెంట్ లో భరద్వాజ్, అవంతిక దంపతులు కాపురం పెట్టారు. కూతురితో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్, అవంతిక దంపతులు సినిమాలు, వీకెండ్ లో హోటల్స్ కు వెళ్లి చాలా సంతోషంగా జీవించారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వాళ్లతో కూడా భరద్వాజ్, అవంతిక దంపతులు కలసిమెలసి ఉంటున్నారు.
కూతురి ముందే భార్య మీద దాడి చేసిన టెక్కీ
అవంతిక భర్త భరద్వాజ్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భరద్వాజ్ పీకలదాక మద్యం సేవించి రాత్రి లేటుగా ఇంటికి వెళ్లాడు. ఇంట్లో టెక్కీ భార్య అవంతిక, ఆమె కూతురు ఉన్నారు. ఆ సందర్బంలో మద్యం సేవించే విషయంలో భరద్వాజ్, అవంతిక దంపతుల మద్య గొడవ జరిగింది.
మద్యం మత్తులో భార్యను స్పాట్ లో చంపేసిన టెక్కీ
ఆ సమయంలో సహనం కోల్పోయిన భరద్వాజ్ అతని కూతురి కళ్ల ముందే అతని భార్య అవంతిక మీద దాడి చేసి ఆమెను దారుణంగా చంపేడయం కలకలం రేపింది. అవంతిక తండ్రి రంజన్ కుమార్ శర్మా (62) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భరద్వాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.