చర్చలకు రెడీ, ఆ యాత్రకు ప్రత్యామ్నాయాలు: చైనా బంపర్ ఆపర్
భారత పర్యాటకుల కోసం ఇతర మార్గాల ద్వారా కైలాస్ మానస సరోవరం యాత్రకు చేరుకొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించింది.ఈ మేరకు తాము భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు .
న్యూఢిల్లీ:భారత పర్యాటకుల కోసం ఇతర మార్గాల ద్వారా కైలాస్ మానస సరోవరం యాత్రకు చేరుకొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించింది.ఈ మేరకు తాము భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది.
భారత బలగాలు చైనా భూబాగంలోకి ప్రవేశించడంతోనే భారతీయుల కైలాష్ మానస సరోవరం యాత్రను నిలిపివేశామని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది.

అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చర్చించేందుకు సిద్దమేనని చైనా ప్రకటించింది.ఈ మేరకు న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికారి ప్రతినిధి గ్జీ లియాన్ ఓక ప్రకటన విడుదల చేశారు.
చైనా భారత్ ప్రజలతో ప్రజల అనుబంధానికి సాంస్కృతిక సంబంధాలకు కైలాష్ మాసన సరోవరం యాత్రను ముఖ్యమైన భాగంగా భావిస్తోందన్నారాయన. భారతీయ ప్రజల మత మనోభావాలను చైనా గౌరవిస్తూనే వస్తోందన్నారు. జిజాంగ్ లోని కైలాస్ మానస సరోవరం యాత్రకు ప్రాధాన్యతమిస్తోందన్నారు.
మానస సరోవరానికి లిపులెకు పాస్ మీదుగా అధికారిక యాత్ర, లాస్ అండ్ పురంగ్ మీదుగా అనధికారిక యాత్ర ప్రస్తుతానికి యధాతదంగా సాగుతోందని, నాథులా పాస్ మీదుగా నిలిచిపోయిన ఈ యాత్ర కోసం ఇప్పటికే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
2014 లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ వచ్చిన సందర్భంగా నాథులా పాస్ మీదుగా మానస సరోవరం యాత్రను ఆ దేశం అనుమతించింది. 2016 లో తెరిచిన ఈ మార్గాన్ని తాజాగా సిక్కింలోని సరిహద్దులో ఇరుదేశాల సైన్యాల మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా మూసివేశారు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications