ఎయిర్ ఫోర్స్ డే: మిగ్-21ను నడిపించిన యుద్ధ వీరుడు
లక్నో: త్రివిధ దళాల్లో కీలకమైనదిగా భావించే వైమానిక దళం మంగళవారం 87వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోంది. పాకిస్తాన్ పై భారత్ ఇప్పటిదాకా చేసిన రెండు సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించినది వైమానిక దళమే. సరిహద్దులను దాటుకుని మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరిమి కొట్టిన వైమానిక దళ అధికారులు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ఎయిర్ షోను నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్.. మిగ్-21 బైసన్ ను నడిపించారు.
ఈ వార్షికోత్సవ వేడుకలకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భడూరియా తదితరులు హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ లో అన్ని రకాల యుద్ధ విమానాల విన్యాసాలను ప్రదర్శించారు.

ప్రత్యేకించి- పాకిస్తాన్ లోని బాలాకోట్ పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్న విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్.. మిగ్-21 బైసన్ విమానాన్ని నడిపించారు. ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తరిమి కొట్టినప్పటి సాహస కృత్యాలను గుర్తు చేశారు.
ఈ ఎయిర్ షో పరేడ్ లో మిగ్-21 బైసన్ తో పాటు మిరేజ్-2000 రకానికి చెందిన మూడు విమానాలు, రెండు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు కట్టి పడేశాయి. బాలాకోెట్ పై నిర్వహించిన వైమానిక దాడులు అంచనాలకు మించి రాణించాయని ఎయిర్ చీఫ్ మార్షల్ భడూరియా చెప్పారు. యుద్ధ విమానాలు జార విడిచిన బాంబులు గురి తప్పలేదని, లక్ష్యాన్ని ఛేధించాయని అన్నారు. వైమానిక శక్తి సామర్థ్యాలేమిటో బాలాకోట్ దాడులతో అటు పాకిస్తాన్ కు, ఇటు ప్రపంచ దేశాలకు తెలియజేశామని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలు సైతం రాబోతున్నాయని, వాటి వల్ల వాయుసేనకు అదనపు బలం చేకూరుతుందని అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications