దటీజ్ నరేంద్ర మోడీ! గుజరాత్, హిమాచల్లతో కలుపుకొని 29 రాష్ట్రాల్లో 19 బీజేపీవే
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ అన్ని రాష్ట్రాలను వరుసగా హస్తగతం చేసుకుంటోంది. అంతకుముందు ఉన్న రాష్ట్రాలతో పాటు ఇటీవల వరుసగా పలు రాష్ట్రాలలో బీజేపీ పాగా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
సొంతగా, ఇతర పార్టీలతో కలిపి చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరాది నుంచి వస్తే జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, గోవా, అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలో అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఉన్న విషయం తెలిసిందే.
పంజాబ్, మేఘాలయ, మిజోరాం, కర్నాటక, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. 29 రాష్ట్రాలకు గాను బీజేపీ ఇప్పుడు గెలిచిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో కలుపుకుంటే 19 చోట్ల అధికారంలో ఉంది. మోడీ ప్రధాని అయ్యాక ఒకటి రెండు మినహా.. బీజేపీ వరుసగా రాష్ట్రాలను గెలుస్తోంది.