తొమ్మిది రోజుల్లో బ్యాంకుల్లో 5,44,571 కోట్ల పాతనోట్లు డిపాజిట్
డిల్లీ : పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో పెద్ద ఎత్తున బ్యాంకుల్లో నగదు డిపాజిట్ అయింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో 5లక్షల44 వేల571 కోట్లు డిపాజిట్ అయ్యాయి.మరింత డిపాజిట్ అయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా పాత నగదు నోట్ల డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 30వ, తేదివరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో తమ వద్ద ఉన్న పాత నగదు నోట్లను పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.

పెద్ద నగదు నోట్లను రద్దుచేసి సోమవారానికి 13 రోజులు అవుతోంది. అయినా బ్యాంకుల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు జనం. 9 రోజులకే దేశవ్యాపంగా 5 లక్షల కోట్ల నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది.
దేశవ్యాప్తంగా 9 రోజుల్లో ఈ నగదు డిపాజిట్ అయినట్టు ఆర్ బి ఐ ప్రకటించింది.5 లక్షల,11 వేల,565 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. 33,006 కోట్లు విలువైన నగదు మార్పిడి జరిగింది. ఎటిఎం ల నుండి 1లక్ష03వేల316 కోట్లను డ్రా చేసినట్టు ఆర్ బి ఐ ప్రకటించింది.












Click it and Unblock the Notifications