వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు 'భర్తలను' దోచుకున్న మహిళ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

కోట: ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మహిళతో పాటు ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి నగదును, విలువైన వస్తువులను దోచుకెళ్లింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారంనాడు వెల్లడించారు.

ఐదారుగురు గల ముఠాలో కుసుమ్ అలియాస్ పూజ ఓ సభ్యురాలని, వారు డబ్బుతో విలువైన వస్తువులతో పారిపోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంగా సహాయ శర్మ చెప్పారు. కసుమ్‌తో పాటు ఆమె అనుచరులు అశోక్, జుగల్ కిశోర్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Woman arrested for robbing 5 'husbands'

తాను ఐదుగురు మగాళ్లను పెళ్లి చేసుకుని ఆ తర్వాత వారికి చెందిన విలువైన వస్తువులతో పారిపోయినట్లు కుసుమ్ విచారణలో అంగీకరించినట్లు గంగా సహాయ శర్మ చెప్పారు. కుసుమ్‌ను ఆమె భర్త అశోక్ కుమార్ మీనా బంధించాడని ఆరోపిస్తూ అశోక్, జుగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది.

పెళ్లి సమయంలో మీనా కుసుమ్ బంధువుగా చెప్పుకున్న అశోక్‌కు 1.50 లక్షల రూపాయలు ఇచ్చాడని విచారణలో తేలింది. కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ముఠా సభ్యులను కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
A 35-year-old woman was arrested along with her accomplices in neighbouring Baran district for allegedly duping five men into marrying her before fleeing away with their money and valuables, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X