ఉద్యోగం ఇప్పిస్తామని.. అడవిలోకి తీసుకెళ్లి మహిళపై గ్యాంగ్రేప్
మీరట్: ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలోని కన్కేర్ఖేడా ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. మురళీపూర్కి చెందిన ముహ్మద్ జహీద్, మెహబూబ్ అనే ఇద్దరు వ్యక్తులు బాధిత మహిళ(30) ఇంట్లోకి ప్రవేశించి ఉద్యోగం ఇప్పిస్తామంటూ గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఆమెను కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది.
తన భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.