భార్య ఆరోగ్యం కోసం థానేలో మహిళ నరబలి, అరెస్ట్

దీంతో ఆమెను అదే ప్రాంతంలో ఉంటున్న రాంధానీ కృపాశంకర్ అనే వ్యక్తి తన ఆటోలో పలుమార్లు కహర్ వద్దకు తీసుకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో రాంధానీ భార్యకు ఆరోగ్యం పాడైంది. ఎవరినైనా బలిస్తే అంతా సర్దుకుంటుందని కహర్ స్వామీజీ రాంధానీకి చెప్పాడు.
దీంతో కళవతిని బలిచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఇంట్లో పూజ చేస్తున్నామని, దాంట్లో పాల్గొంటే మీ కుమారుడికి నయమవుతుందని చెప్పి నవంబర్ 16వ తేదిన కళావతిని ఇంటికి తీసుకు వచ్చారు. ఆ పూజా కార్యక్రమంలో తల నరికి బలి ఇచ్చారు.
ఆ తర్వాత ఆమె మొండాన్ని ఓ గోనె సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేశారు. తలను వసాడా వంతెన వద్ద పడేశారు పోలీసులు కేసును ఛేదించి నిందితులు, స్వామీజీ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లును మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాస్ చేసింది ఆ మరుసటి రోజే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications