కోర్టు ఆవరణలోనే రేప్ బాధితురాలి కాల్చివేత

మూడేళ్ల క్రితం స్థానిక స్వామీజి గోవిందానంద తీర్థ తనపై అత్యాచారం చేశాడనే అరోపణ చేసి న్యాయ పోరాటం చేస్తున్న మహిళ జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ యువతితో పాటు ఉన్న ఆమె తల్లి కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. ఆమెను అలీఘర్ జిల్లాలోని ఆస్పత్రిలో చేర్చారు.
ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వామీజీ ప్రోద్బలంతోనే బాధితురాలిపై, ఆమె తల్లిపై దుండగులు దాడి చేశారా, లేదా అనేది తెలియదు. అయితే, ఈ ఘటనలో మరో స్వామీజి భగీరథి బాబా హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆమెను ఎందుకు హత్య చేశారనేది తెలియడం లేదు. అత్యాచారం కింద కేసు నమోదైనప్పటికీ గోవిందానంద తీర్థను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications