వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు ఆవరణలోనే రేప్ బాధితురాలి కాల్చివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman shot dead in court premises, she was allegedly raped by local godman
మథుర: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర జిల్లాలోని ఓ కోర్టు ఆవరణలో అత్యాచార బాధితురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఆ పాతికేళ్ల మహిళపై దుండగులు కాల్పులు జరిపారు.

మూడేళ్ల క్రితం స్థానిక స్వామీజి గోవిందానంద తీర్థ తనపై అత్యాచారం చేశాడనే అరోపణ చేసి న్యాయ పోరాటం చేస్తున్న మహిళ జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ యువతితో పాటు ఉన్న ఆమె తల్లి కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. ఆమెను అలీఘర్ జిల్లాలోని ఆస్పత్రిలో చేర్చారు.

ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వామీజీ ప్రోద్బలంతోనే బాధితురాలిపై, ఆమె తల్లిపై దుండగులు దాడి చేశారా, లేదా అనేది తెలియదు. అయితే, ఈ ఘటనలో మరో స్వామీజి భగీరథి బాబా హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమెను ఎందుకు హత్య చేశారనేది తెలియడం లేదు. అత్యాచారం కింద కేసు నమోదైనప్పటికీ గోవిందానంద తీర్థను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

English summary
A rape survivor was gunned to death by unknown people in the premises of a court in western Uttar Pradesh's Mathura district yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X