టెక్కీ సవాల్ :''నా భర్త నపుంసకుడు, నాకు పిల్లలను పుట్టిస్తే ప్లాట్ రాసిస్తా''
తన భర్త నపుంసకుడని, తొలిరాత్రే ఈ విషయం తేటతెల్లమైందని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆరుమాసాల నుండి తన భర్త ఇంటి నుండి అదృశ్యమయ్యారని చెప్పారు.
బెంగుళూరు: నాభర్త నపుంసకుడు, తొలి రాత్రే ఈ విషయమ తేటతెల్లమైంది.నాకు న్యాయం చేయండంటూ ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పేరు పొందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇద్దరు ఐటి ఇంజనీర్లు 2011 లో ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు.తన భర్త కునాల్ శ్యామ్ తొలి రాత్రే అతను నపుంసకుడని తేలిందని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఒకవేళ తన భర్త సంతానభాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్ ను అతడిపేరుతో రాసిస్తానని ఆమె సవాల్ విసిరింది.
తనతో కాపురం చేయాలని పదే పదే నిలదీయడంతో నపుంసకుడనే విషయం బట్టయలైందని చెప్పింది.ఆనాటి నుండి ఆయన ఇంటిని వదిలివెళ్ళిపోయాడని చెప్పారు.
వివాహమైన రోజు నుండి తనతో తన భర్త కాపురం చేయలేదని చెప్పారు. ఈ విషయమై తన అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని వివాహిత ఆరోపించారు. పోలీసులు ఆమె భర్తను వెతికి తీసుకురావాలని ఆమె కోరింది.